క్రికెట్ విజేతలకు బహుమతులు అందజేత
(రెబ్బెనవుదయంప్రతినిధి) రెబ్బనలోమండలస్థాయి క్రికెట్ క్రీడల విజేతలకు ఎంపిపి కార్నతం సంజీవ్ కుమార్ బహుమతులు అందచేశారు స్వర్గీయ బండారి ఫణికుమార్ స్మారక చిహ్నార్థం ఏర్పాటు చేసిన మండల స్థాయి క్రికెట్ పోటీలలో మొదటి బహుమతి జంటి లెవెన్స్ జూనియర్స్ రెబ్బెన 10,000 లతో పాటు బహుమతి అందచేశారు రెండవ బహుమతి 5000 ఫ్రెండ్స్ రెబ్బెన క్రీడాకారులకు అందచేశారు అదేవిధముగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అజమేరా శేఖర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చీకటి మహేందర్ కి అందచేశారు అనంతరం వారు మాట్లాడుతూ యువకులు విద్యతో పాటు క్రీడా రంగంలో ఆశక్తి కనపరుస్తూ మండలాన్ని ముందంజలో ఉండేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమములో సర్పంచు పెసరు వెంకటమ్మ , మార్కెట్ వైస్ చేర్మెన్ కుందారపు శంకరమ్మ , ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ , తూర్పుజిల్లా అధ్యక్షుడు నవీన్ కుమార్ జైశ్వాల్ , చిరంజీవి , పాపయ్య , శాంతి తదితర క్రీడా కారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment