Friday, 11 March 2016

సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి

సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి): సింగరేణిలో వివిధ విభాగాలలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ  సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షులు అల్లూరి లోకేష్ రెబ్బెన మండలంలోని  సింగరేణి బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో  52రంగాలలో పని చేస్తున్న కార్మికుల కనీస వేతనాల  జీ ఓ ల కాల పరమితి ముగిసిందని  వివిధ పరిశ్రమలలో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనము. రూ.15000లు మరియు  కరువు భత్యం పాయింట్ కు రూ.10.50పై.  ఇవ్వాలని,కోల్ ఇండియా వేతనాలు,బోనస్,కార్మిక చట్టాలు అమలు చేయాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో  సి ఐ టి యు ఆసిఫాబాద్ కార్యదర్శి వేములవాడ రమేష్ ,ఓ బి  వర్కర్ యూనియన్ నాయుడు మరియు సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘంనాయకులు పాల్గొన్నారు.  

No comments:

Post a Comment