(రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలంలోని ఇందిరానగర్ గ్రామానికి సమీపంలో గల బెల్లపు ఒర్రె దగ్గర విద్యుత్ అధికారుల నిర్లక్షం తో నిండు ప్రాణం విద్యుతఘతానికి బలైపోయింది. వివరాల్లోకి వెళ్తే ఆసిఫాబాద్ బూరుగూడ నుండి గొర్ల మందను రెబ్బెన వైపుకు తీసుకువస్తున్న గొర్ల కాపరి కొండ పర్వతలు (45) సుమారు సాయంత్రం గం.. 5.30 సమీపం లో విద్యుతఘతానికి గురై మృతి చెందాడు. మృతుడు తాండూరు మండలం లోని కాసిపేట కు చెందినవాడిగా బందువులు తెలిపారు. స్థానికుల కథనం ప్రకారం మృతుడు కర్ణం బీరయ్య కు కులికి వచ్చాడని వాళ్ళు చెప్పారు. గత పదిహేను రోజుల క్రితం వీచిన గాలి వానకి విద్యుత్ తీగలు వ్రేలాడుతున్నట్లు స్తానికులు, రైతులు వివరించారు. అయినా విద్యుత్ అధికారులు పట్టించుకోకుండా వుండటంతో ఈ ప్రమాదం జరిగిందని వారు తెలిపారు.
No comments:
Post a Comment