బెటర్ యూత్ బెటర్ సొసైటీ సేవా సంస్థ అద్వర్యం లో గాంధీ జయంతి
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 02 : బెటర్ యూత్ బెటర్ సొసైటీ సేవా సంస్థ అద్వర్యం లో జాతిపిత మహాత్మా గాంధీ 148 వ జయంతి వేడుకలను గోలేటి బస్టాండ్ లో గాంధీ చిత్ర పటానికి పుల మాలలు వేసి ఆయనను స్మరించుకున్నారు. ఈ సందర్బంగా బెటర్ యూత్ బెటర్ సొసైటీ సేవా సంస్థ అధ్యక్షుడు ఒరగంటి రంజిత్, మాట్లాడుతూ మహాత్ముని జీవితం ఈనాటి ప్రపంచ యువతకు స్ఫూర్తి దాయకమని, ఒక్క భారతదేశమే కాకుండ ప్రపంచంలోని నాయకులూ అందరు మహాత్ముని రచనలను, జీవితాన్నిఆదర్శంగా తీసుకున్నవారేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అజయ్,ఉపాధ్యక్షులు, రవీందర్,రాజశేఖర్, తదితర సభ్యులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment