దివ్యంగులకు రెబ్బెన మండల కేంద్రంలోనే బస్సు పాసులు జారీ
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 26 : తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణాసంస్థ దివ్యంగులకు ఇచ్చే రాయితీ బస్సు పాసులు దివ్యంగుల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని వారు జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్ వరకు రావలసిన అవసరం లేకుండా అధికారులే రెబ్బెన మండల కేంద్రంలోనే బస్సు బస్సు పాసులు జారీచేయాలని నిర్ణయించారు. ఈ నెల . 30 న రెబ్బెన మండల కేంద్రంలోని ఎం పి డి ఓ ఆఫీసులోబస్సు పాసులు జారీచేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.మండలం లోని దివ్యంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బస్సు పాస్ కోసం కావలసిన ధ్రువీకరణ పత్రాలు: సదరం సర్టిఫికెట్,ఆదరికార్డ నకలు, ఫోటో, మరియు 30 రూపాయలు చెల్లించి బస్సు పాస్ పొందవచ్చు.
No comments:
Post a Comment