Sunday, 15 October 2017

అబ్దుల్ కలాం సేవలు మరువ లేనివి

అబ్దుల్ కలాం సేవలు మరువ లేనివి
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 15 :మాజీ రాష్ట్ర పతి  దివంగత అబ్దుల్ కలాం సేవలు మరువలేనివని  అబ్దుల్ కలం  పాఠశాలలో కరెస్పాండంట్ అబుల్  ఫయాజ్   అన్నారు . కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్లో ఆదివారంనాడు  అబ్దుల్ కలం  పాఠశాలలో అబ్దుల్ కలాం 86 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు . ఈ సందర్బంగాపాఠశాల కరెస్పాండంట్ అబుల్  ఫయాజ్   మాట్లాడుతూ  . రాష్ట్రపతి గా అబ్దుల్ కలాం నిరాడంబర  జీవితాన్ని గడిపారని పేర్కొన్నారు . దేశానికిశాస్త్రవేత్తగా ,హైద్రాబాద్లోని డిఫెన్సె రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజషన్,  రాకెట్ సెంటర్ ఇమారత్ వేదికగా ఎన్నో అంతరిక్ష ప్రయోగాలలో అబుల్ క,లామ్ తనదైన ముద్రవేశారని, అతని సేవలు మరువలేనివని కొనియాడారు. పేద కుటుంబములో పుట్టి , శాస్త్రవేత్తగా ఎదిగి , రాష్ట్ర పతిగా దేశానికి ఎనలేని సేవలు చేసి దేశ గౌరవం కాపాడిన మహా గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం అని తెలిపారు . విద్యార్థులు అతన్నీ ఆదర్శనంగా తీసుకొని , సమాజములో మంచి గుర్తింపు పొందాలని అన్నారు  . అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంచారు . ఈ కార్యక్రమములో ప్రధానోపాధ్యాయులు హిదయతుల్లా ,అశోక్,రఫీక్, ప్రవీణ్, హకీమ్ అన్సారీ, తదితరులు పాల్గొన్నారు.  

No comments:

Post a Comment