గాంధీ మార్గమే దేశానికీ సన్మార్గం - ఉప తహసీల్దార్
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 02 : గాంధీజీ చూపిన మార్గమే మన దేశానికి శ్రీరామ రక్ష అని రెబ్బెన ఉప తహశీల్ధార్ విష్ణు అన్నారు . సోమవారం స్థానిక రెబ్బన తహశీల్ధార్ కార్యాలయములో 148వ మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు . గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేశారు . ఆయన మాట్లాడుతూ ఈనాటి యువత సత్ప్రవర్తనతోనే దేశప్రగతి ముడిపడి ఉందని అన్నారు. . నవ సమాజములో యువత పాత్ర చాల ముఖ్యమని , క్రమశిక్షణతో ఉండాలని , సమాజానికి పనికి వచ్చే పనులు చేయాలని తెలిపారు . ఈ కార్య క్రమములో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ,రెవిన్యూ ఇనస్పెక్టర్ అశోక్, వి ఆర్ ఓ ఉమ్లాల్, స్థానిక నాయకుల తదితరులు ఉన్నారు .
No comments:
Post a Comment