గాంధీజీ అడుగు జాడల్లో నడవాలి
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 02 : బాపూజీ జయంతిని రెబ్బెనమండలం నంబాల గ్రామ జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్లో ఘనంగా జరుపుకున్నారు. గ్రామా సర్పంచ్ గజ్జెల సుశీల ఆధ్వర్యంలో పాఠశాలా కమిటీ చైర్మన్ దెబ్బతి సత్యనారాయణ మహాత్ముని చిత్రపటానికి పూలమాలవేసి వందనం సమర్పించారు. గాంధీజీ అడుగు జాడల్లో నడవాలని అన్నారు . విద్యార్థులు క్రమశిక్షణతో చదివి సమాజ సేవలో ముందుండాలని, అప్పుడే పేరు ప్రతిష్టలు వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టి ఆర్ ఎస్ పార్టీ నాయకులూ మహావీర్ వర్డ్ మెంబెర్ సీమ జైస్వాల్, గ్రామయువకులు పర్వత సాయి, సమ్మయ్య, అరుంసై, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment