యూనిటీ యూత్ రైడర్ స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్త కార్యదర్శిగా జర్పుల శివాజీ
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 8 : యూనిటీ యూత్ రైటర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్త కార్యదర్శిగా రెబ్బెన మండలానికి చెందిన జర్పుల శివాజీని ఎన్నుకున్నట్లు సంస్థ అధ్యక్షులు చునార్కర్ రాజ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా జర్పుల శివాజీ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో స్వచ్ఛంద సంస్థ నాకు బాధ్యతను అప్పగించినందుకు సంస్థ అధ్యక్షునికి కృతజ్ఞతలు తెలుపుతూ సంస్థకు శక్తివంచన లేకుండా తన వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు . ఈ సందర్భంగా జర్పుల వినోద్,దినేష్, అర్జున్, ప్రతాప్, ఆనంద్,కైలాష్ లు స్వచ్చందంగా సమాజసేవలో పాలుపంచుకుంటామని ఈ సంస్థలో చేరారన్నారు.
No comments:
Post a Comment