Friday, 1 December 2017

ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ

ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ 

    కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్  01 : అంతర్జాతీయ  ఎయిడ్స్ దినాన్ని పురస్కరించుకొని శుక్రవారం జాతీయ సేవ పథకం ఆధ్య్వర్యంలో ప్రభుత్వకళాశాల మరియు  పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రమైన అసిఫాబాడ్ లో    కళాశాలనుండి సబ్ జైలు వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు ర్యాలీ  లో ఎయిడ్స్ భూతాన్ని తరిమి కొడదామని నినదించారు.   వారు  మాట్లాడుతూ ఎయిడ్స్ అనేది  వ్యాది  నిరోదక శక్తి  తగ్గిపోవడం  ద్వారా వచ్చేటటువంటి వ్యాధి అని ,ఇది   ఒక  వైరస్ వ్యాది  అని  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  ప్రిన్సిపాల్ ఏ   గోపాల్,ఎం ఎస్ ఎస్ ప్రోగ్రాము   ఆఫీసర్ కే.  శ్రీనివాసరావు,రామకృష్ణ, సంతొహ్, ఆత్మారాం, సతీష్ ,వేణుకుమార్, తదితరుల  పాల్గొన్నారు.
రెబ్బెన ;  అంతర్జాతీయ  ఎయిడ్స్ దినాన్ని పురస్కరించుకొని శుక్రవారం జాతీయ సేవ పథకం ఆధ్య్వర్యంలో ప్రభుత్వకళాశాల మరియు  పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ప్రధాన కూడలిలో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ కుందారపు శంకరమ్మ, ప్రకాష్, అమరేందర్,  లెక్చరర్లు, ఉపాధ్యాయులు  తదితరుల  పాల్గొన్నారు.

No comments:

Post a Comment