Wednesday, 13 December 2017

గణిత టాలెంట్ టెస్ట్ లో ప్రతిభ కనబరిచిన జెడ్ పి హెచ్ ఎస్ విద్యార్థి


  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (మా ప్రతినిధి) డిసెంబర్ 13 :  కొమురంభీం జిల్లా  రెబ్బెన మండలం గణిత టాలెంట్  జిల్లా పరిషత్ పాఠశాల 10 వ తరగతి విద్యార్థి  గట్టు వంశీ   గణిత టాలెంట్ టెస్ట్ లో  ప్రతిభ కనబరిచి  మండల టాపర్ గ  నిలిచాడు. అంతేకాకుండా   జిల్లా స్థాయిలో నిర్వహించిన గణిత టాలెంట్ టెస్ట్ లో  తృతీయ స్థానాన్ని సాధించి రాష్ట్ర స్థాయి గణిత టాలెంట్ టెస్టుకు  అర్హత సాధించినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్వర్ణలత హర్షం వ్యక్తం చేసారు. , గణిత ఉపాధ్యాయులు మొగిలి, పార్వతి మరియు ఇతర ఉపాధ్యాయులు వంశీని అభినందించారు. ఈ సందర్భంగా  .  ఇతర విద్యార్థులు కూడా వంశీని ఆదర్శంగా తీసుకుని మంచి మార్కులతో పాసయి తల్లిదండ్రులకు గురువులకు సమాజానికి మంచి పేరు తెచ్చిపెట్టాలని ప్రధానోపాధ్యాయురాలు  పిల్లలకు ప్రార్థన సమయంలో సందేశం ఇచ్చారు.

No comments:

Post a Comment