ప్రాధమిక వ్యవసాయ సహకార కేంద్రం లో వరి ధాన్యం కొనుగోలు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 6 : రెబ్బెనమండల ప్రాధమిక వ్యవసాయ సహకార కేంద్రం ఆధ్వర్యంలోబుధవారం 400 బస్తాల ఏ గ్రేడ్ ధాన్యం కొనుగోలు చేసినట్లు కేంద్రం ముఖ్య కార్యనిర్వాహక అధికారి ఆర్ సంతోష్ తెలిపారు. మండలంలోని రైతుల సౌకర్యంకోసం నేర్పల్లి, నారాయణపూర్, తక్కళ్లపల్లి,నక్కలగూడ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు ఈ కేంద్రాలలో ఏ గ్రేడ్ ధాన్యానికి 1590 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి 1550 రూపాయలు చెల్లిస్తున్నట్లు, మండలంలోని రైతులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. రైతులు ధాన్యం తీసుకొనివచ్చేటప్పుడు వారి ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, పట్టాదార్ పాస్ బుక్, మరియు వి ఆర్ ఓ సర్టిఫికెట్ నకళ్ళను తీసుకోని రావలసింది గ తెలిపారు.
No comments:
Post a Comment