Friday, 1 December 2017

ఎయిడ్స్ ను తరిమి కొడదాం అవగాహన ర్యాలీ ; డాక్టర్లు కుమార్, నాగమణి

ఎయిడ్స్ ను తరిమి కొడదాం    అవగాహన ర్యాలీ ;   డాక్టర్లు కుమార్,  నాగమణి  
 
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్  01 : ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా  రెబ్బెన  ప్రభుత్వ ప్రాధమిక ఆసుపత్రి డాక్టర్ల ఆధ్వర్యంలో  రెబ్బెన మండల కేంద్రంలో ర్యాలీ  నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆసుపత్రి సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డాక్టర్ కుమార్, డాక్టర్  నాగమణి  మాట్లాడుతూ ఎయిడ్స్ పై ప్రతిఒక్కరు అవగాహన కల్పించుకోవాలని ,, వ్యాధిగ్రస్తులను వివక్షతో చూడవద్దని, సరైన మందులు సకాలంలో వాడితే వ్యాధి నియంత్రణలో ఉంటుందని అన్నారు.ప్రతిఒక్కరు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంతోష్, పావని, కమలాకర్, మరియు సిబ్బంది పాల్గొన్నారు. 

No comments:

Post a Comment