రెవిన్యూ సిబ్బంది నల్ల బ్యాడ్జీల నిరసన
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 01 : నల్ల బ్యాడ్జీలతో రెబ్బెన మండల తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది శుక్రవారం కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగాఇన్చార్గ్ర్ తహసీల్దార్ విష్ణు మాట్లాడుతూ జగిత్యాల జిల్లా గొల్లపల్లి తహశీల్దార్ , విఆర్ఓలపై ఎఫ్ ఐ ఆర్ నమోదును వ్యతిరేకిస్తూ మరియు పెద్దపల్లి జిల్లా తహశీల్దార్స్ కు ఇచ్చిన మోమెులపై నేడు తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ రాష్ట్రకార్యవర్గం పిలుపు మేరకు రెవెన్యూ ఉద్యోగుల పై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకొనేంత వరకు కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ అశోక్, సీనియర్ అసిస్టెంట్ ఊర్మిళ,వి ఆర్ ఓ లు బాపన్న, ఉమ్లాల్ , శంకర్, శ్రీనివాస్, జమీల్, నీలైయ్యా, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment