Monday, 30 October 2017

బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

 బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 30 :    నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు  చేరవేసి   కార్యకర్తలు బిజెపి బలోపేతానికి కృషి చేయాలని గోడగోని భరత్ గౌడ్ అన్నారు. సోమవారం రెబ్బెన మండలంలోని పుంజుమేరాగూడ గ్రామంలో భారతీయ జనతా యువమోర్చా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  నూతన కార్యకర్తలు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సభ్యత్వంలో గ్రామంలోని వారు భారీ ఎత్తున  పాల్గొని సభ్యత్వ నమోదు జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రయోజనాలను పేదప్రజలకు అందరికీ అందించి 2019 నాటికల్లా బిజెపి బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో  బీజేవైఎం కార్యదర్శి సంజయ్ , కొమురంభీం జిల్లా అధ్యక్షులు జె  పి  పౌడెల్, జిల్లా ప్రధాన కార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ గుల్బమ్ చక్రపాణి, రెబ్బెన మండల అధ్యక్షులు కుందారపు బాలకృష్ణ, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు జుమ్మిడి రాజేష్, బీజేవైఎం మండల అధ్యక్షులు ఇగురాపు సంజీవ్, ఆసిఫాబాద్ మండల అధ్యక్షులు ఖాండ్రే  విశాల్,మధుకర్,శ్రీధర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి :: జిల్లా పాలనాధికారి చంపాలాల్

ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి :: జిల్లా పాలనాధికారి చంపాలాల్ 

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 30 :  ప్రజాఫిర్యాదులను పరిశీలించి సత్వరమే పరిష్కరించేందుకు కృషిచేయాలని కొమురంభీం జిల్లా పాలనాధికారి చంపాలాల్ జిల్లా అధికారులను  ఆదేశించారు. సోమవారం కార్యాలయంలో ప్రజలవద్దనుంచి ఫిర్యాదులు స్వీకరించి సంబంధిత  అధికారులను పై విధంగా ఆదేశించారు. సోమవారంనాడు పలు మండలాలనుంచి 65 మంది ఫిర్యాదులను అందించారు .కాగజ్ నగర్ కు  చెందిన మహమ్మద్ ఆఫ్జాల్ కు చెందిన భూములు చేవెళ్ల కాలువ నిర్మాణంలో ముంపునకు గురయ్యాయని,తగు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. నవేగంకు చెందిన దాగం మోహన్ ఖైర్గమ్ గ్రామా శివారులో వారసత్వంగా వచ్చిన భూమి గురించి, ఫిర్యాదు చేసారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్, చీఫ్ ప్లానింగ్అధికారి  కిష్టయ్య, డి ఆర్ డి ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్ శంకర్ తదితర జిల్లా అధికారులుపాల్గొన్నారు.

Sunday, 29 October 2017

ప్రత్తి రైతుకు గిట్టుబాటు ధరను ఇచ్చి న్యాయం చేయాలనీ రైతు జేఏ సి

ప్రత్తి రైతుకు గిట్టుబాటు ధరను ఇచ్చి న్యాయం చేయాలనీ రైతు జేఏ  సి   

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 29 :    ప్రత్తి రైతులకు గిట్టుబాటు ధరను ప్రకటించి మధ్య దళారులని నిలువరించలని జిల్లా రైతు జాక్ నాయకులూ బానోతు కిషన్ అన్నారు. రెబ్బెన మండలం గోలేటిలో ఆదివారం ఏర్పాటు చేసిన  సమావేశంలో   మాట్లాడారు.     ప్రత్తి రైతులకు గిట్టుబాటు ధరను ఇచ్చి న్యాయం చేయాలనీ   తీవ్ర వర్షాభావ పరిస్థిలో  పత్తి  పంట తప్ప వేరే పంట వేయ  లేని ఈ  కాలంలో ఎన్నో ఒడిదొడుగులను ఎదుర్కొని ,అకాల వర్షాలతో ,నకిలీ విత్తనాలతో  ఇబ్బందులలో రైతుకి తాను పండించినా పంటకు గిట్టుబాటు ధరను ప్రకటించి మధ్య దళారులని నిలువరించి ప్రబుత్యమే నేరుగా మద్దతు దరతో  రైతునుంచి పంటను కొనాలని  అన్నారు. ఈ సమావేశం లో జర్పులగణేశులుఎం హరి,జ్ సురేష్,నర్సయ్య తదితరులు పాల్గొన్నారు .

హైదరాబాద్ లో కొలువుల కొట్లాట సభను విజయవంతం చెయాలి

హైదరాబాద్ లో   కొలువుల కొట్లాట సభను విజయవంతం చెయాలి
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 29 :  చదువు కున్న యువతకు  ఉద్యోద నోటిఫికేషన్ ఇచ్చి  వాటిని భర్తీ చేయాలని తలపెట్టిన హైదరాబాద్ లో జరుగు కొలువుల కొట్లాట సభను విజయవంతం చేయాలనీ  కొమురంభీం జిల్లా జాక్ కో  కన్వీనర్ రాయల  నర్సయ్య అన్నారు. తెలంగాణ జాక్    ఆధ్వర్యంలో ఆదివారం రెబ్బెన మండలం  గోలెటి లో ఎర్పాటు చేసిన సమవేశం లో  సభకు సంబందించిన గోడ ప్రతులను విదులచేసి మాట్లాడారు.   తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చాలని,చదువు కున్న యువతకు  ఉద్యోగ  నోటిఫికేషన్ ఇచ్చి  వాటిని భర్తీ చేయాలని అలాగే ఉద్యోగ కాలెండర్ ను విడుదల చేయలని, ప్రవేట్ ఉద్యోగాలలో స్థానిక యువకులకు  అవకాశం ఇవ్వాలన్నడిమాండ్ తో  మంగళవారంనాడు  హైదరాబాద్ లో  తలపెట్టిన సభకు నిరుద్యోగులు, యువకులు తెలంగాణ వాదులు అందరు కలసి అధిక సంఖ్యలో పాల్గొని    విజయవంతం చేయలని పిలుపునిచ్చారు.  ఈ సమవేశం లో  జిల్లా  రైతు జాక్  నాయకులూ గణేష్ లాల్ ,కిషణ్ ,సురెష్,హరి ప్రేమనాయక్, కే దేవయ్య, రామ కృష్ణ, వంశీకృష్ణ, సందీప్ , శ్రీకాంత్ ,సాయి లక్ష్మి , ప్రసన్న,సోనీ ,అశోక్  తదితరుల పాల్గోన్నారు .

Saturday, 28 October 2017

రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్నీ విజయవంతం చేయండి ; ఖాండ్రే విశాల్

మంచిర్యాలలో జరిగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్నీ  విజయవంతం చేయండి ; ఖాండ్రే   విశాల్ 


  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 28 : మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాని సమావేశాన్ని విజయవంతం చేయాలనీ  ఆసిఫాబాద్ బీజేపీ మండల అధ్యక్షులు  ఖాండ్రే  విశాల్ అన్నారు. శనివారం    ఆసిఫాబాద్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆదివారంనాడు మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి శ్రీ హంసరాజు ఆహిల్ ,కేంద్రమంత్రివర్యులు హాజరు కానున్నారని ఇందులో భాగంగా ఆసిఫాబాద్ లో భారతరత్న బాబాసాహెబ్ అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తామని, స్థానిక బీజేపీ నాయకులను అభిమానులను ప్రజలను  ఉద్దేశించి ప్రసంగిస్తారని ,మరియు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేపట్టిన పథకాలపై అవగాహనా కల్పిస్తారని, కావున స్థానిక బీజేపీ నాయకులూ, అభిమానులు, ప్రజలు ఆదివారంపెద్దసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయగలరని కోరారు. ఈ సమావేశంలో మెకార్టి గోపాల్, నిర్మల, రాధికా,రాజ్ కుమార్  రాకేష్ తదితరులు పాల్గొన్నారు. 







సింగరేణిలో విజిలెన్సు వారోత్సవాలు బెల్లంపల్లి ఏరియా డీజీఎం

సింగరేణిలో విజిలెన్సు వారోత్సవాలు  బెల్లంపల్లి ఏరియా  డీజీఎం  

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 28 :  బెల్లంపల్లి ఏరియా లో ఈ నెల 30వ తేదీనుంచి నవంబర్ 4 వరకు విజిలెన్సు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు గోలేటి డిజైన్ బి సుదర్శనం  శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సింగరేణివ్యాప్తంగా యాజమాన్యం విజిలెన్సు వారోత్సవాలు  నిర్వహిస్తున్నది ఇందులో భాగంగా గనులపై కార్మికులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సింగరేణి పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు వకృత్వ పోటీలు నిర్వహిస్తారని, 30న అన్నిగనులు,డిపార్టుమెంటలా నందు సమగ్రత ప్రతిజ్ఞ చేయడం జరుగుతుందనితెలిపారు. కావున ఉద్యోగులందరూ విజిలెన్సు అవగాహనా వారోత్సవాలలో ఉత్సాహంగా పాల్గొని అవినీతి రహిత భారతదేశాన్ని నిర్మించాలని కోరారు. 

Friday, 27 October 2017

పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలి :జిల్లా ఇంచార్జ్ ఎస్పి యం . శ్రీనివాస్

పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలి :జిల్లా ఇంచార్జ్ ఎస్పి యం . శ్రీనివాస్ 


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా   ( వుదయం ప్రతినిధి ) అక్టోబర్ 27 జిల్లా లో ఎటువంటి పెండింగ్ కేసు లు ఉండకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంచార్జ్ ఎస్పి యం. శ్రీనివాస్ తెలిపారు, శుక్రవారం జిల్లా లోని  స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్ లోని సమావేశ మందిరం లో జిల్లా ఇంచార్జ్ ఎస్పి జిల్లా లోని అధికారుల తో సమావేశమును నిర్వహించి జిల్లా లో శాంతి భద్రత ల నిర్వహణ కు తీసుకోవలసిన చర్యల గురించి మరియు అసెంబ్లీ సమావేశాలు  ఉన్నందున జిల్లా లో ముందస్తూ గా  అవలంబించాల్సిన పద్దతులను గురించి అధికారులకు వివరించారు,నిందితులను కస్టడీ లోకి తిసుకున్నపుడు తగు జగరుకతతో వుండాలని  సూచించారు ,సమస్య ఉత్పన్నమైనప్పుడు సత్వరం  జిల్లా అధికారులు స్పందించాలని ఇంచార్జ్ ఎస్పి యం. శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు.ఈ సమావేశం లో జిల్లా డిఎస్పి హబీబ్ ఖాన్ , ఎస్బి సి ఐ సుధాకర్ ,ఆసిఫాబాద్ టౌన్ సి ఐ వినోద్ ,కాగజ్ నగర్ టౌన్ సి ఐ వెంకటేశ్వర్ , కాగజ్ నగర్ రూరల్ సి ఐ  ప్రసాద్ రావు , వాంకిడి సి ఐ  శ్రీనివాసు, రెబ్బెన సి ఐ మదన్ లాల్, ఎస్బి ఎస్సై శివకుమార్ లు పాల్గొన్నారు.

స్కాలర్ షిప్స్, ఫీజు రియింబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలి

స్కాలర్ షిప్స్, ఫీజు  రియింబర్స్ మెంట్ వెంటనే  విడుదల చేయాలి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా   ( వుదయం ప్రతినిధి ) అక్టోబర్ 27: పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్ మరియు రియింబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్ ,రియింబర్స్ మెంట్ విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ కుమురం భీం జిల్లా సమితి ఆద్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం రవీందర్ మాట్లాడుతూ స్కాలర్ షిప్స్,రియింబర్స్ మెంట్ విడుదల చేయకపోవడం వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నరాని అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నరాని ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తుందని అన్నారు. రాష్ట్రంలో విద్యారంగం సమస్యలతో సతమతమవుతుంటే కెసిఆర్ ప్రభుత్వం విద్యాను ప్రైవేటీకరణ చేసే విధంగా విధానాలు అవలంభిస్తుందని అన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలోకి ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుందని అన్నారు. సంక్షేమ వసతి గృహల్లో విద్యార్థులు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నరాని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యహ్న భోజనం ప్రకటనలకే పరిమితం అయిందని అన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ,పాలిటెక్నిక్,ఐటీఐ కళాశాలలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆద్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి పూదరి సాయి, జిల్లా కార్యవర్గ సభ్యులు తిరుపతి,శ్రీకాంత్,పర్వతి సాయి,మహిపాల్,రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Thursday, 26 October 2017

మహిళా ఉద్యోగిపై దాడి వార్త అవాస్తవం

మహిళా ఉద్యోగిపై దాడి  వార్త అవాస్తవం 

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 26 : బుధవారం ఉదయం రేచిని కోల్ యార్డులో విధులు నిర్వహిస్తున్న శ్రీమతి విజయ అనే మహిళ ఉద్యోగిపై ఎలాంటి దాడి జరగలేదాని  పత్రికలో ప్రకటించినది అవాస్తవమని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ రవి శంకర్ అన్నారు. వివరాల్లోకి వెళితే  శ్రీమతి విజయ ఉదయం తొమ్మిది గంటలకు నుండి సాయంత్రం ఐదు గంటల వరకు యథావిధిగా విధులు నిర్వహించి ఇంటికి వెళ్ళినారు జరగని సంఘటనను జరిగినట్లుగా పత్రికా ప్రకటనలు చేసి సింగరేణి అధికారులను బాధ్యులు చేయడం సరి అయినది కాదు దీనిని  పత్రికా ముఖంగా  తెలిపారు.

దివ్యంగులకు రెబ్బెన మండల కేంద్రంలోనే బస్సు పాసులు జారీ

దివ్యంగులకు రెబ్బెన మండల కేంద్రంలోనే బస్సు పాసులు జారీ 
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 26 :  తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణాసంస్థ దివ్యంగులకు ఇచ్చే  రాయితీ బస్సు పాసులు దివ్యంగుల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని వారు జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్ వరకు రావలసిన అవసరం లేకుండా  అధికారులే రెబ్బెన మండల కేంద్రంలోనే  బస్సు బస్సు పాసులు  జారీచేయాలని నిర్ణయించారు. ఈ నెల .  30 న రెబ్బెన మండల కేంద్రంలోని ఎం పి డి ఓ ఆఫీసులోబస్సు పాసులు  జారీచేస్తున్నట్లు ఒక   ప్రకటనలో తెలిపారు.మండలం లోని దివ్యంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బస్సు పాస్ కోసం కావలసిన ధ్రువీకరణ పత్రాలు: సదరం సర్టిఫికెట్,ఆదరికార్డ నకలు, ఫోటో, మరియు 30 రూపాయలు చెల్లించి బస్సు పాస్ పొందవచ్చు. 

దోడ్డు బియ్యంతోనే విద్యార్థులకు భోజనం ; ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్

దోడ్డు బియ్యంతోనే విద్యార్థులకు భోజనం ; ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 26 :  రాష్ట్రంలో విద్యార్థులకు దోడ్డు బియ్యంతోనే భోజనం పెడుతున్నారని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ ఆరోపించారు. గురువారం రోజున మండలంలోని రెబ్బెన, నంబాల ఉన్నత పాఠశాలలను ఏఐఎస్ఎఫ్ ఆద్వర్యంలో సందర్శించడం జరిగిందని తెలియజేశారు. రెబ్బెనలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులు తింటున్న భోజనాన్ని పరిశీలించగా విద్యార్థులకు దోడ్డు బియ్యంతో భోజనం పెడుతున్నరని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం వలన సెప్టెంబర్ నెలలో రావాల్సిన సన్న బియ్యం రాకపోవడంతో దోడ్డు బియ్యంతో విద్యార్థులకు మధ్యహ్న పెట్టడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పత్రిక ప్రకటనలకే పరిమితం అయిందని, దోడ్డు బియ్యాన్నే సన్నగా చేసి పాఠశాలలకు వసతి గృహలకు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో పూర్తిగా విఫలం చెందిందని అన్నారు. చలి కాలం ప్రారంభమైనందున వసతి గృహలకు తలుపులు, కిటికీలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని, నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆద్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్  డివిజన్ కార్యదర్శి పూదరి సాయి, మండల కార్యదర్శి పర్వతి సాయి మరియు  విద్యార్థులు పాల్గొన్నారు.

జిల్లా పాలనాధికారిని కలసిన టి డబ్ల్యూయూ జె- ఐ జె యూ కొమురంభీం జిల్లా సభ్యులు ; జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని వినతి

జిల్లా పాలనాధికారిని కలసిన టి డబ్ల్యూయూ జె- ఐ జె  యూ కొమురంభీం జిల్లా సభ్యులు

  • జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని వినతి 
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 26 :    తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఐ జె  యూ  అస్సోసియేషన్ ( కొమురంభీం జిల్లా)కి కొత్తగా ఎన్నికైన క మిటి సభ్యులు  గురువారం నాడు జిల్లా పాలనాధికారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు పాలనాధికా రికి పుష్పగుచ్ఛం అందచేశారు. జిల్లా అధ్యక్షులు అబ్దుల్ రహమాన్  పాలనాధికారికి  తమ సభ్యులను పరిచయంచేసారు. అనంతరం  తమ సమస్యలు పరిష్కరించాలని విన తిపత్రం సమార్పించారు. _నూతన జిల్లా కమిటీకు కలెక్టర్ అభినందనలు తెలియచేసి వారి సమస్యలపై సానుకూలంగా స్పందించారని అసోసియేషన్ అధ్యక్షులు  అబ్దుల్ రహమాన్ తెలిపారు. అనంతరం మాట్లాడుతూ  అర్హులైన జార్నలిస్టులకు వెంటనే అక్రి డేషన్ జారీ చేసి ,జిల్లాలోని జార్నలిస్టు లకు ఇంటి స్థలాలు,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలనీ ,ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు .ఆలస్యం చేయకుండా అక్రిడేషన్లు జారీ చేయాలనీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహేమన్, ప్రధాన కార్యదర్శి స్ ఎస్ సంపత్ కుమార్ లు కోరారు.జిల్లా కేంద్రంలో పని చేస్తున్న ఎలెక్ట్రానిక్ మీడియా విలేకరులకు స్టేట్ బస్ పాస్ సౌకర్యం కల్పించిన జిల్లా కలెక్టర్ ,డిపిఅర్ఓ ,అక్రిడేషన్ కమిటి సభ్యులకు కృతజ్ఞతలు తెల్పారు. ఏ సమస్యలు ఉన్న దృష్టికి తీసుకొనిరావాలని కలెక్టర్ తెలిపారన్నారు. ఈ  .    కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు సదానంద్,  కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహేమన్, ప్రధాన కార్యదర్శి ఎస్ సంపత్ కుమార్,అక్రి డేషన్ మెంబెర్ ప్రకాష్ గౌడ్ ,కోశాధికారి అడప సతీష్ ,జిల్లా ఉపాధ్యక్షులు చంద్రకాంత్ ,సుదీర్,జాయింట్ సెక్రటరీలు  డీ సునీల్ కుమార్ ,శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శి కొల్లి సునీల్ కుమార్ చౌదరి, కార్యవర్గ సభ్యుడు రమేశ్వర్ నాయక్  పాల్గొన్నారు.

Wednesday, 25 October 2017

పేద ప్రజల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం ; ఎమ్మెల్యే కోవ లక్ష్మి

 పేద ప్రజల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం ; ఎమ్మెల్యే కోవ లక్ష్మి 

  • డబల్ బెడ్ రూమ్   ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ  

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 25 :     పేద ప్రజల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని  ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. బుధవారం నాడు రెబ్బెన మండలం ఇందిరా నగర్ లోని జూనియర్ కాలేజీ భవనం పక్కన సుమారు ఒకటిన్నర   ఎకరాల స్థలంలో రెబ్బెన మండలానికి మంజూరైన ముప్పై డబల్ బెదురూమ్ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేసారు. ఈ సందర్భంగా    మాట్లాడుతూ  తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో గతంలో ఏ  ప్రభుత్వం చేయనంత ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి వాటిని కార్యరూపంలో చేసి చూపిస్తున్నారని  అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి  టి సి  అజ్మీర  బాపు రావు, ఎం పి  పి  కర్నాధం సంజీవ్ కుమార్, రెబ్బెన సర్పంచ్ పెసర వెంకటమ్మ, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ  చైర్మన్  నరసింగం,, వైస్ ఎం పి  పి రేణుక, రెబ్బెన సింగల్ విండో డైరెక్టర్ మధునయ్య, కాంట్రాక్టర్ నరేందర్,  టి ఆర్ ఎస్ నాయకులు  సోమశేఖర్, నవీన్ కుమార్ జైస్వాల్, సుదర్శన్ గౌడ్, చిరంజీవి గౌడ్, మడ్డి  శ్రీనివాస్ గౌడ్,, తదితరులు పాల్గొన్నారు. 

Tuesday, 24 October 2017

కొండల్ 77వ వర్ధంతి సభను విజయవంతం చేయండి ; ఆదివాసీల సంఘం

కొండల్ 77వ వర్ధంతి సభను విజయవంతం చేయండి ; ఆదివాసీల సంఘం 

కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 24 :  అమరజీవి  రౌట్  కొండల్ 77వ వర్ధంతి సభను విజయవంతం చేయలని కొలవారు మండల అధ్యక్షుడు మైలారపు శ్రీనివాస్ తుడుందెబ్బ జిల్ అధ్యక్షుడు గోపాల్ లు కోరారు. దీనికి సంబందించిన కార పాత్రలను ఆదివారం రెబ్బెన మండల కేంద్రం లో విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ  ఆదివాసుల చరిత్రలో అమరజీవి కుమ్రం భీం తో వీర మరణం పొందిన కుమ్రం భీం సహచరుడు అప్పటి ప్రభుత్వంతో ఆదివాసీల భూమి నీరు అడవిపై పూర్తి హక్కులు వారికి ఉండాలని వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన ఎడ్ల రౌటర్ కొండల్ అమరుడయ్యాడని అన్నారు ఈ నెల గురువారం రోజు ఉదయం తొమ్మిది గంటలకు జెండా ఆవిష్కరణ కాగజ్‌నగర్‌ లొని త్రిశూల్ పర్ పర్వతంపైన నవోదయ కాలేజీ వెనుక కార్యక్రమం ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ఆదివాసులు గిరిజనులు  కళ్యాణ పరిషత్తుకు రావాలని వారు కోరారు.

యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య

 యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య

కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 24 ; రెబ్బెన మండల కేంద్రానికి చెందిన శానగొండ శ్రావణ్ (24) మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం జరిగింది.  ఇరుగు పొరుగు  సమాచారం మేరకు శ్రవణ్ తల్లి కాంతమ్మ తో కలిసి ఉంటున్నారు అని తల్లి ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్ గా విధులు నిర్వహించడానికి వెళ్లింది దీంతో ఇంట్లో పై కప్పుకు చివరలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అన్నారు ఈ మేరకు రెబ్బెన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నారు.   ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియరాలేదు. 


తక్కళ్ళపల్లి సర్పంచ్ సస్పెండ్

 తక్కళ్ళపల్లి సర్పంచ్ సస్పెండ్

కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 24  రెబ్బెన మండల కేంద్రంలోని తక్కళ్ళపెల్లి గ్రామ సర్పంచు మడి చిన్నయ్యను గ్రామపంచాయతీ నిధులు దుర్వినియోగం విషయంలో మంగళవారం జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని ఈఓపీఆర్డీ కిరణ్ తెలిపారు.  ప్రస్తుతం ఉప సర్పంచ్ గ  కొనసాగుతున్న చంద్రకళకు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించడం జరిగిందని తెలిపారు. 

బెల్లంపల్లి ఏరియాలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు

బెల్లంపల్లి ఏరియాలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు 


కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 24 ; బెల్లంపల్లి ఏరియాలో పనిచేస్తున్న సింగరేణి ఉద్యోగులు మాజీ ఉద్యోగులకు పిల్లలకు పరిసర ప్రభావిత నిరుద్యోగులకు యువకులకు ట్రాక్ డ్రైవింగ్లో శిక్షణ పొందేందుకు సింగరేణి సేవా సమితి ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిజిఎం పర్సనల్ జి కిరణ్ తెలిపారు. శిక్షణ పొందేవారు వారి యొక్క హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి మూడు సంవత్సరాలు నుంచి ఐదు సంవత్సరాలు అనుభవం కలిగి, మానసికంగా మరియు శారీరకంగా ఆరోగ్యంగా ఉండి ఇంగ్లీషు హిందీ తెలుగులో రాయడం మరియు చదవడం వచ్చిన వారు మొదటి బ్యాచ్లో పది మందిని ఎంపిక చేయడం జరుగుతుంది అని తెలిపారు. మిగతా వారిని తర్వాత బ్యాచ్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులతో ఈ నేల 27న జీఎం కార్యాలయంలోని పర్సనల్ డిపార్టు మెంట్ నందు ఇంటర్వ్యూకి హాజరు కాగలరు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు అభ్యర్థులు తమ తన డ్రైవింగ్ లైసెన్సు మరియు సంబంధిత పత్రాలతో పర్సనల్ డిపార్టుమెంట్ నందు సంప్రదించగలరు ఎంపిక అయిన డ్రైవర్కు మొదటి బ్యాచ్ బెంగుళూరులో నెంబర్ పదమూడు నుండి పదిహేడు వరకు శిక్షణ ఉంటుందని తెలిపారు. 

డబ్ల్యూపీఎస్ ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు

డబ్ల్యూపీఎస్ ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు

కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 24 ; బెల్లంపళ్లి ఏరియా గోలేటి టౌన్ షిప్ లో మంగళవారం  వర్క్ ప్యూన్ స్టోర్స్ అండ్ గేమ్స్ డబ్ల్యూపీఎస్ జీఏ ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసి డి జి ఎం పర్సనల్ జె  కిరణ్  మాట్లాడరు బెల్లంపల్లి ఏరియాలో జరుగుతున్న ఈ పోటీలను ప్రతిభ కార్చి కంపెనీ స్థాయిలో కోల్ ఇండియా స్థాయిలో సింగరేణికి తద్వారా బెల్లంపెల్లి ఏరియాకు మంచి పథకాలు సాధించాలని అన్నారు  పీవో ఖైరిగూడ మరియు ఎస్వో జిఎం టీం మధ్య పోటీ జరిగిన దానిలో జిఎం టీమ్ గెలిచింది. ఈ కార్యక్రమంలో అంజయ్య, రమేష్, కె నరేష్ కుమార్, జె కిషోర్, సుగ్రీవులు, హీరాలాల్, శ్రీనివాస్, చంద్రకుమార్, కిరణ్, రాజేశ్వర్, రమేష్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. 



Monday, 23 October 2017

అక్రమంగా రవాణా చేస్తున్న కలప పట్టివేత

అక్రమంగా రవాణా చేస్తున్న కలప పట్టివేత 

కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 23 : అక్రమంగా రవాణా చేస్తున్న కలపను ఆదివారం రాత్రి  వెంకటాపూర్ వైపు ఆటోలో కలపను   తరలిస్తుండగా పట్టుకున్నట్లు  ఎఫ్ ఆర్ ఓ చంద్రకుమార్ తెలిపారు. ఆటోలో పదిహేడు టేకు దుంగలు ఉన్నట్లు వాటి విలువ సుమారు 46,799 రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్ తప్పించుకొని పత్తిచేలలోకి పారిపోయినట్లు తెలిపారు. ఆటో యజమాని షైక్ అన్వారోద్దిన్, ఆటో డ్రైవర్ దేవదాస్ లపై కేసు నమోదు చేసి విచారణ జరిపిస్తున్నామని తెలిపారు. ఈ దాడిలో సిబంది సాయిచరణ్ ,  మహేందర్, శ్రీను  పాల్గొన్నారు. 


అకాల వర్షాలతో నష్టపోయిన పత్తి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

అకాల వర్షాలతో నష్టపోయిన పత్తి రైతులకు  నష్టపరిహారం చెల్లించాలి 
  • పాలనాధికారి కార్యాలయం ఎదుట ధర్నా వినతిపరం సమర్పణ

కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 23 : అకాల వర్షాలతో పత్తిపంట  నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని సోమవారంనాడు జిల్లా పాలనాధికారి కార్యాలయం ఎదుట  బూరుగుడ  రైతులు ధర్నా నిర్వహించారు. అనంతరం పాలనాధికారికి  వినతి పత్రం సమర్పించారు.  ఈ సందర్బంగా మాట్లాడుతూ వర్షాభావం మరియు    అకాల వర్షాల వాళ్ళ జిల్లాలో పత్తి   పంట తీవ్రంగా నష్టపోయిందని కావున ప్రభుత్వం తగిన నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలోబూరుగుద సర్పంచ్ కాశయ్య ,ఎంపీటీసీ రమేష్,ఉపసర్పంచ్ శ్రీనివాస్, వార్డ్ మెంబెర్ మహేష్ ,పిడుగు వెంకటేశం, పెంటయ్య, నారాయణ మరియు రైతులు పాల్గొన్నారు. 

సెనగ విత్తనాలు పంపిణి షురూ

సెనగ విత్తనాలు పంపిణి షురూ

కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 23 :సెనగ విత్తనాలు పంపిణీకి  సిద్ధముగా ఉంచినట్లు రెబ్బెన  మండల వ్యవసాయ అధికారి మంజుల తెలిపారు. సోమవారంనాడు విత్తన పంపిణి ప్రారంబించి మాట్లాడుతూ యాభై క్విటాళ్ళ    విత్తనాలు పంపిణి కి సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ఇరవై ఐదు కిలోల విత్తనాల  ధర 1200 రూపాయలని, కావలసిన రైతులు మీ సేవ పహాణి, ఆధార్ కార్డుల నకలు తో రెబ్బెన ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో సంప్రదించగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన సర్పంచ్ పెసర వెంకటమ్మ, ఆసిఫాబాద్ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ ,డైరెక్టర్  పల్లె రాజేస్వర్ రావు,  సింగల్ విండో చైర్మన్ రవీందర్, డైరెక్టర్ మధునయ్య, సహాయ వ్యవసాయ విస్తరణాధికారి  మార్క్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Saturday, 21 October 2017

విద్యారంగ సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ; ఎఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్

 విద్యారంగ సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ; ఎఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్

కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 21 :రాష్ట్రంలో నెలకొని ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ డిమాండ్ చేశారు శనివారం రోజున విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యారంగ సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.  వసతి గృహాలలో  వాచ్ మన్  కామాటి   పోస్టులను భర్తీ చేయకుండా  ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని  అన్నారు నూతనంగా ప్రారంభించిన గురుకుల పాఠశాలల కు స్వంత భవనాలు వెంటనే నిర్మించాలని అద్దె భవనాల్లో అరకొర వసతులతో  వసతుల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు డీఎస్సీ నిర్వహించడంలో ప్రభుత్వం అలక్ష్యం  వహిస్తుందని ఉపాధ్యాయుల కొరతలో పాఠశాలలు మూసి వేసే పరిస్థితి వచ్చిందని  అన్నారు  విద్యారంగంపై ప్రభుత్వానికి  చిత్తశుద్ధి ఉంటే వెంటనే డీఎస్సీ వేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలోని కార్పొరేట్ కళాశాలలకు మృత్యు గ్రహాలుగా మారాయని విద్యార్థులను విద్యా పేరిట మానసికంగా వేధిస్తున్నాయని అన్నారు రాష్ట్రంలో కార్పొరేట్ కళాశాలల ఆగడాలు మితిమీరిపోతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం  సిగ్గుచేటు అన్నారు నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో విద్యా అభివృద్ధికి కృషి చేయడానికి డిమాండ్ చేస్తామని ప్రతి జిల్లాలో డిగ్రీ పాలిటెక్నిక్ ఐటీఐ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని కేజీ టూ పీజీ ఉచిత విద్యను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు దేశంలో రాష్ట్రంలో పాలననుబాగుందని  భావిస్తున్నాయని విద్యా వ్యతిరేక విధానంపై  పోరాడుతామని ఎన్నికల్లో విద్యార్థులకు   ఇచ్చిన  హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి మండల కార్యదర్శి రాయిల్ల నర్సయ్య ఎఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి పార్వతి సాయికుమార్ ఏఐఎ్సఎఫ్ మండల అధ్యక్షుడు మలిశెట్టి మహిపాలఅనుదీప్ తదితరులు పాల్గొన్నారు

పోలీస్ అమరవీరులు స్పూర్తి ప్రదాతలు వారి త్యాగాలు అమరం

పోలీస్ అమరవీరులు  స్పూర్తి ప్రదాతలు వారి త్యాగాలు అమరం 

కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 21 :పోలీస్ అమరవీరుల త్యాగాలు సదా చిరస్మరణియం అని , సమాజ శ్రేయస్సు , శాంతి భద్రతల పరిరక్షణలో రోజుల తరబడి వుంటూ ఎన్ని అటుపోటులు ఎదురు అయిన  ప్రజల కోసం మేము వున్నాం అని భరోసా కలిపిస్తూ, ఎన్ని అవాంతరాలు అడ్డంకులు ఎదురైనా చివరకు కర్తవ్య నిర్వహణ లో తమ తమ తమ ప్రాణాలను తృణప్రాయం గా బావించి  ప్రాణ త్యాగం చేసి నవ సమాజ నిర్మాణమునకు బాటలు వేసిన పోలీస్ అమరవీరులను , వారి త్యాగాలను గుర్తువుంచుకొని , వారి స్పూర్తి ను మనం పొందాలని ముఖ్య అతిధులుగా విచ్చేసిన జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్ , ఎం ఎల్ ఏ   కోవా లక్ష్మి మరియు  ఎం ఎల్ సి  పురాణం సతీష్ లు అన్నారు, శనివారం జిల్లా లోని  స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో పోలీస్ సంస్మరణ దినం సందర్బముగా  అమరవీరుల స్మృత్యర్థం  జిల్లా  లోని పలు పట్టణ పుర వీదుల గుండా అమరవీరుల ప్లకార్డ్  ల తో కూడిన  ర్యాలి  ను జిల్లా పోలీస్ ల అద్వర్యం లో నిర్వహించారు అనతరం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో అమరవీరుల కోసం స్మృతి పెరేడ్ ను నిర్వహించారు, అనంతరం ఈ సంవత్సరం విధి నిర్వహణ లో అసువులు బాసిన 383 అమరుల యొక్క పేర్లను జిల్లా జాయింట్ కలెక్టర్ చదివి వినిపించారు వారి సేవలను స్మరించుకుంటూ వారికి   అంజలి ఘటించారు. అతిధులు , పోలీస్ సిబ్బంది  మరియు  విద్యార్థులు అమరవీరుల స్తూపంనకు పూలమాలలు వేసి ఘనమైన నివాళులను అర్పించారు, అమరవీరుల వారోత్సవాలలో బాగం గా గత వారం రోజులు గా నిర్వహిస్తున్న వ్యాస రచన , పెయింటింగ్ , ఉపన్యాస పోటిలలో గెలుపొందిన విద్యార్థులు అయిన  లక్ష్మి దహేగం .మహేష్  చింతలమానేపల్లి, ఎం . లక్ష్మి ప్రియ  కృష్ణవేణి హై స్కూల్ కాగజ్ నగర్ , .నమ్రత  రెబ్బెన, కౌశిక్ సింగ్ రెబ్బెన , B. లక్ష్మణ్ రాసపల్లి   లకు మరియు పోలీస్ శాఖ నుంచి వ్యాస రచన పోటిలలో  శ్రీనివాస్ ఎస్సై తిర్యాని ,  తిరుపతి ఎస్సై లింగాపూర్  మహేందర్ రెడ్డి హెడ్ కాన్స్టేబుల్ , తిరుమల  అసిస్టెంట్ సబ్  ఇన్స్పెక్టర్ మరియు బబ్బెర శేఖర్  లకు జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్ , ఎం ఎల్ ఏ   కోవా లక్ష్మి మరియు  ఎం ఎల్ సి  పురాణం సతీష్ ల యొక్క చేతుల మీదుగా బహుమతులను అందించారు.ఈ కార్యక్రమము లో డిఎస్పి హబీబ్ ఖాన్ , జిల్లా సి ఐ లు ఎస్సై లు, ఎస్బి సి ఐ సుధాకర్ , ఎస్బి ఎస్సై శివ కుమార్ ,  శ్యాం సుందర్ ,పోలీస్ రవాణా అధికారి శ్రీనివాస్ , ఆర్ ఐ వామన మూర్తి , ఆర్ ఎస్సై లు అనిల్ కుమార్ , శేఖర్, ఆసిఫాబాద్ సర్పంచ్ మర్సకోల సరస్వతి , గ్రందాలయ కమిటి చైర్మన్ కనక యాదవ్ రావు , , సింగల్ విండో చైర్మన్ అలిద్దిన్ అహ్మద్ , మార్కెట్ కమిటి చైర్మన్ గంధం శ్రీనివాస్ , పీ.ఆర్.ఓ  మనోహర్  మరియు జిల్లా  పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 




అయోడిన్ పై అవగాహన సదస్సు

అయోడిన్ పై అవగాహన సదస్సు 
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 21 : అంతర్జాతీయ అయోడిన్ దినోత్సవ సందర్భంగా కొమురం భీం జిల్లా రెబ్బెన లోని ఇందిరానగర్ పాఠశాలల్లో శనివారం అవగాహాన సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు డి రవీందర్ విద్యార్థుల తల్లిదండ్రులకు అయోడిన్  పై అవగాహన సదస్సు   నిర్వహించారు ఈ సందర్భంగా అయోడిన్ లోపించిన వారికి అందించవలసిన  ఆహార పదార్థాల గురించి విద్యార్థులకు గ్రామములోని మాతా శిశువులకు వివరించడం జరిగింది ముఖ్యంగా అయోడిన్ లోపిస్తే  వచ్చే వ్యాధులు థైరాయిడ్  గురించి  వివరించడం జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు తిరుపతమ్మ, అనితా, బి  అనిత, జే అశోక్ గ్రామములోని తల్లులు తదితరులు పాల్గొన్నారు.

Monday, 16 October 2017

బాధితుల ఫిర్యాదులపై తక్షణం స్పందిచాలి – జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్

బాధితుల  ఫిర్యాదులపై  తక్షణం స్పందిచాలి  – జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ 
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 16 :పోలీసు స్టేషన్ కు వచ్చే బాధితుల ఫిర్యాదులను అధికారులే స్వయముగా తెలుసుకొని  సత్వరం స్పందించాలి అని   జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. సోమవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పి అద్వర్యం లొ ప్రజా ఫిర్యాదుల విబాగం ను నిర్వహించి ,వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 12 మంది ఫిర్యాదుల ను జిల్లా ఎస్పి స్వయముగా స్వీకరించారు, ప్రజా ఫిర్యాదు లో అల్లూరి శాంతభాయి భర్తపేరు   లింగయ్య తన యొక్క భూమి ను అన్యులు అక్రమము గా ఆక్రమించుకొని తనకు అన్యాయం చేస్తున్నారని ఫిర్యాదు చేసారు, మెరుగు రాజేష్ తన పైన కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సస్పెక్ట్ కేసు ను తొలగించి తన యొక్క చదువు కు సహకరించాలి అని జిల్లా ఎస్పి ను వేడుకున్నారు,మరియు జిల్లా లోని  పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ తమ ఫిర్యాధులను జిల్లా ఎస్పి కు విన్నవించారు సమస్యల పైన స్పందించిన జిల్లా ఎస్పి ఫిర్యాదు దారులకు సాంత్వన చేకురేలా చర్యలు తీసుకుంటానని ఫిర్యదుదారులకు హామీ ను ఇచ్చారు, తగు సూచనలతో సంబందిత అధికారులను ఫిర్యాదులు పరిష్కారం అయ్యేలా ఆదేశించారు.ఈ కార్యక్రమం లో  ఎస్పి సీసీ దుర్గం శ్రీనివాస్ , ఎస్బి సీ ఐ సుధాకర్, ఎస్బి ఎస్సై లు శివకుమార్ , శ్యాం సుందర్ , డిసీఆర్బీ ఎసై రాణాప్రతాప్ , అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్  ప్రహ్లాద్, కరుణ ,సీనియర్ అసిస్టెంట్ ఇంతియాజ్ ,కేదార సూర్యకాంత్ ఫిర్యాదుల విభాగం అధికారిని సునీత మరియు పీ ఆర్ ఓ మనోహర్ లుబాధితుల  పాల్గొన్నారు.

Sunday, 15 October 2017

రెబ్బెన టిప్పర్ అసోసియేషన్ కోర్ కమిటీ ఎన్నిక

 రెబ్బెన టిప్పర్ అసోసియేషన్ కోర్ కమిటీ ఎన్నిక 

కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 15 : కొమురంభీం జిల్లారెబ్బెన  మండల్ టిప్పర్ అసోసియేషన్ సాధారణ సభ్య సమావేశం ఆదివారం నాడు జరిగింది. ఈ సమావేశంలో సభ్యులు  కోర్ కమిటీని ఎన్నుకొన్నారు. కమిటీ  అధ్యక్షులుగా పి  హనుమంత రావు ,ఉపాధ్యక్షులుగా నవీన్ కుమార్ జైస్వాల్, ప్రధాన కార్యదర్శిగా సురేష్ జైస్వాల్, కోశాధికారిగా పి  విదుర్గ రావు, సంయుక్త కార్యదర్శిగా పులగం తిరుపటి, అడ్వేర్టీస్ సెక్రెటరీగా వెంకటేశ్వర గౌడ్, ప్రధాన సలహాదారుగా కే రత్నాకర రావు, సభ్యులుగా , భాస్కర్,శంకర్, పోటు  శ్రీధర్ రెడ్డి, .జి శ్రీనివాస్ రెడ్డి ,కిరణ్ కుమార్, పెసర నరేష్ కుమార్, రాజ్ కుమార్, సత్యనారాయణ, కిరణ్ కుమార్ గౌడ్, , పి  శంకర్, రామ్మోహన్, సత్యనారాయణ, మల్లేష్, మధుకర్, సంపత్ కుమార్ ,రాందాస్, తిరుపతి గౌడ్ లనుఎన్నికయ్యారని తెలిపారు.

అబ్దుల్ కలాం సేవలు మరువ లేనివి

అబ్దుల్ కలాం సేవలు మరువ లేనివి
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 15 :మాజీ రాష్ట్ర పతి  దివంగత అబ్దుల్ కలాం సేవలు మరువలేనివని  అబ్దుల్ కలం  పాఠశాలలో కరెస్పాండంట్ అబుల్  ఫయాజ్   అన్నారు . కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్లో ఆదివారంనాడు  అబ్దుల్ కలం  పాఠశాలలో అబ్దుల్ కలాం 86 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు . ఈ సందర్బంగాపాఠశాల కరెస్పాండంట్ అబుల్  ఫయాజ్   మాట్లాడుతూ  . రాష్ట్రపతి గా అబ్దుల్ కలాం నిరాడంబర  జీవితాన్ని గడిపారని పేర్కొన్నారు . దేశానికిశాస్త్రవేత్తగా ,హైద్రాబాద్లోని డిఫెన్సె రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజషన్,  రాకెట్ సెంటర్ ఇమారత్ వేదికగా ఎన్నో అంతరిక్ష ప్రయోగాలలో అబుల్ క,లామ్ తనదైన ముద్రవేశారని, అతని సేవలు మరువలేనివని కొనియాడారు. పేద కుటుంబములో పుట్టి , శాస్త్రవేత్తగా ఎదిగి , రాష్ట్ర పతిగా దేశానికి ఎనలేని సేవలు చేసి దేశ గౌరవం కాపాడిన మహా గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం అని తెలిపారు . విద్యార్థులు అతన్నీ ఆదర్శనంగా తీసుకొని , సమాజములో మంచి గుర్తింపు పొందాలని అన్నారు  . అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంచారు . ఈ కార్యక్రమములో ప్రధానోపాధ్యాయులు హిదయతుల్లా ,అశోక్,రఫీక్, ప్రవీణ్, హకీమ్ అన్సారీ, తదితరులు పాల్గొన్నారు.  

Friday, 13 October 2017

నేరాలు పునరావృతం చేయకండి ; రెబ్బెన ఎస్ఐ నరేష్

 నేరాలు పునరావృతం చేయకండి ; రెబ్బెన ఎస్ఐ నరేష్                         
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 13 : రెబ్బెన పోలీస్ స్టేషన్ లో శుక్రవారం పెండింగ్ లో ఉన్న కేసులను సబ్ ఇన్స్పెక్టర్ కే.నరేష్ కుమార్ పరిశీలించారు. పాత కేసులను విచారించే క్రమంలో నేరస్థులు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐ నేరస్థులను ఉధ్యేశించి  మాట్లాడుతూ నేరాలను వదిలిపెట్టి సమాజంలో మంచి పేరుతో మెలగాలని, సత్ప్రవర్తన తో నడుచుకోవలని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేసారు.ఎంతటి సమస్యనైన సామరస్యంతో  పరిష్కరించుకోవాలని సూచించారు.  అదే విధంగా 56 కేసులలో పాలుపడిన వారిని, 15 మంది సానుభూతి పరులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. దొంగతనాలు, ఇతర సంఘ విద్రోహ పనులకు పాల్పడవద్దని, ఇప్పుడు వారు ఏ యే వృత్తులలో వున్నారు అని ఎస్ఐ అడిగి తెలుసుకున్నారు. విచారణకు హజరు అయ్యిన నెరస్థులన సంతకాలు సేకరించారు. 

మరుగుదొడ్ల బిల్లులు చెలించాలని వినతి

మరుగుదొడ్ల బిల్లులు చెలించాలని వినతి 

కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 13 :  రెబ్బెనలో పెండింగ్ లో ఉన్న మరుగుదొడ్ల బిల్లులు చెల్లించాలని, కొత్త మరుగుదోడ్లను  మంజూరు చెయ్యాలని కోరుతూ శుక్రవారం బీజేపీ, బిజెవైఎం ఆధ్వర్యంలో రెబ్బెన ఎంపిడిఓ సత్యనారాయణ సింగ్ కు వినతి పత్రం సమర్పించారు పెండింగ్ లో ఉన్న మరుగుదొడ్ల బిల్లులు చెలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపి మండల అధ్యక్షుడు కుందారపు బాలకృష్ణ, అసెంబ్లీ కన్వీనర్ గుల్భo చక్రపాణి, బీజేవైఎం నాయకులు మండల మధుకర్, గట్టు తిరుపతి, రాసకొండ రాజన్న, పసులోటి మల్లేష్, ఈగురపు సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. 

Thursday, 12 October 2017

మండల స్థాయి పి హెచ్ సి లను ఆదునికరిoచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతాం ; వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మ రెడ్డి రైతుల కు నిరంతరం విద్యుత్ ఉచితంగా అందజేస్తామం ;రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగురామన్న

  మండల స్థాయి పి హెచ్ సి లను ఆదునికరిoచి ప్రజల ఆరోగ్యాన్ని  కాపాడుతాం ;  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మ రెడ్డి
రైతుల కు నిరంతరం విద్యుత్ ఉచితంగా అందజేస్తామం ;రాష్ట్ర అటవీ శాఖ  మంత్రి జోగురామన్న



    కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 12 :     మండల స్థాయి పి హెచ్ సి లను ఆదునికరిoచి ప్రజల ఆరోగ్యన్నీకాపాడుతామని తెలంగాణ రాష్ర   వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మ రెడ్డి అన్నారు. గురువారం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ డివిజన్ కేంద్రం లోని భట్టుపల్లి గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో బోధకాల వ్యాధిగ్రస్తులతో సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రం సంక్షేమ రంగానికి 40  వేళా కోట్ల రూపాయలు కేటాయించలేదని ఒక్క తెలంగాణ మాత్రమే కేటాయించిందని, తద్వారా సంక్షేమ రంగానికి పెద్దపీట వేసిందని  అన్నారు .ప్రజల ఆరోగ్యపరిస్థితి మెరుగు పడాలంటే ఒక్క ఆరోగ్య శాఖ పనిచేస్తేనే సరిపోదని, ప్రతి పౌరుడు ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అనంతరం బోదకాలు వ్యాధిగ్రస్తులకు దోమతెరలు, వెస్ట్రన్ టాయిలెట్ బేసిన్ లను పంపిణి చేసారు. అనంతరం జిల్లా ఇంచార్జి మంత్రి జోగురామన్న మాట్లాడుతూ 70 సంవత్సరాలుగ  జరగని అభివృద్ధిని  తెలంగాణ వచిన తర్వాత  చేసి చూపిస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానిదే అని  , రాబోయే రోజుల్లో   రైతుల కు నిరంతరం విద్యుత్ ఉచితంగా అందజేస్తామని  , కరెంట్ కోతలు లేకుండా విద్యుత్ అందజేసిన ఘనత ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిదే నని  , రైతులు ఆత్మహత్య చేసుకోకుండా , రైతుల ను  అన్ని విధాలా అధుకునేoదుకు అనేక చర్యలు చేపట్టిన ఘనత తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానిదే  నని  , చరిత్ర లో రైతుల ను అధుకునేoదుకు ఏ ప్రభుత్వం క్రుషి చెయ్యలేదు , ఒక్క తెరాస  ప్రభుత్వం ఈ విషయంలో ఎంతో   శ్రద్ధతో పనిచేస్తుందన్నారు.  , రైతుల కు పెట్టు బడి కొసం ఎకరానికి 4వేలు చెల్లిస్తున్నామని  ప్రాజెక్టుల నుండి  చుక్క నీరు అందకున్న గత ప్రభుత్వాలు పట్టించుకోలేదాని  పంట  , కెనాల్ లేక భూములు బీడు  పోయాయి , కానీ తెరాస పార్టీ  అధికారం లోకి రాగానే అటవీ పర్యావరణ అనుమతులు తెప్పించి కెనాల్స్ పూర్తి చేయించి సాగు నీరు అందిస్తున్న ఘనత ఈ ప్రభుత్వానిదన్నారు.  కుల వృత్తులను   ప్రోత్సహించేo దుకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టామని , బీసీ  లను ఆధుకున్న ప్రభుత్వం ఒక్క తెరాస  ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కోనేరు కోనప్ప , జిల్లా పాలనాధికారి చంపాలాల్  తదితర అధికారులు నాయకులు పాల్గొన్నారు. 

Wednesday, 11 October 2017

జిల్లా కలెక్టరేట్ నూతన భవనానికి శంకుస్థాపన ; ఘనంగా కొమురంభీం జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జిల్లా కలెక్టరేట్ నూతన భవనానికి శంకుస్థాపన ; ఘనంగా కొమురంభీం జిల్లా ఆవిర్భావ దినోత్సవ  వేడుకలు 
 కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 11 :  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  ఏర్పాటై సంవత్సరం ఐన  సందర్బంగా జిల్లా ఆవిర్భావ  వేడుకలు జిల్లా  కేంద్రంలోని ప్రమీల గార్డెన్స్లో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధులుగా అలోల్ల ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న, ఎం పి  నగేష్, ఆదిలాబాద్ ఎం ఎల్ సీ  పురాణం సతీష్ కుమార్, ఆసిఫాబాద్ ఎం ఎల్ ఏ  కోవా లక్ష్మి   లు హాజరయ్యారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు  కావడానికి దారితీసిన పరిస్తుతులను  వివరిస్తూ, రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన జరుగుతున్నా అభివృద్ధి పనులైనా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులను ఉటంకించారు. సంక్షేమ పథకాలైన షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి, ఆసరా, డబల్ రూమ్ పథకాలనువివరించారు. తెలంగాణ ప్రజల ముఖ్యమైన కోరిక మన భూమి, మన నీరు, మన ఉద్యోగాల సాధనకై నిరంతరం పటు పడుతున్న ముఖ్య మంత్రి కే సీ  ఆర్ నాయకత్వాన్ని రాబోయే కాలంలో కూడా  కొనసాగించవలసి అవసరాన్ని వివరించారు. మరెన్నో ఐ టి  ఉద్యోగాల కల్పనకై   కృషి చేస్తామని, మన  రాబోయే కాలంలో బంగారు తెలంగాణ కల్పనలో మన జిల్లా ప్రధమ స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలో ప్రజా  పాలన,ప్రజల రక్షణ చాల బాగుందని కితాబిచ్చారు. జిల్లాలోని ఉద్యోగులందరూ అంకితభావంతో పనిచేసి జిల్లాకు మంచిపేరు తేవాలని అన్నారు.సాంస్కృతిక కళాబృందాలు సభికులను తమ డైన శైలిలో అలరించారు. అనంతరం ఆహూతులకు భోజన ఏర్పాట్లు చేసారు. అంతకు ముందు జిల్లా కలెక్టరేట్ నూతన భవనానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో మంత్రులు,ఎం ఎల్ సీ ,ఎం ఎల్ ఏ  ఎం పి  లు పాల్గొన్నారు.

Monday, 9 October 2017

పాలనాధికారి వివిధ సమస్యల పై వినతులు వెల్లువ

పాలనాధికారి వివిధ సమస్యల పై  వినతులు వెల్లువ 
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 09 : ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా ప్రజా ఫిర్యాదుల విభాగం పని చెయ్యాలని జిల్లా పాలనాధికారి ఎం.చంపాలాల్  అన్నారు. సోమవారం పాలనాధికారి కార్యాలయంలో ప్రజల నుండి వచ్చిన  ఫిర్యాదులను ఆయన పరిశీలించారు. ప్రజల నుండి వచ్చిన సమస్యలను పరిష్కారించాలని కింది స్థాయి ఆధికారులను ఆదేశించారు.

రేపు నూతన జిల్లా కార్యాలయాలకు భూమి పూజ

రేపు నూతన జిల్లా కార్యాలయాలకు  భూమి పూజ 
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 09 :   పాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన నూతన జిల్లా కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో నూతన పాలనాధికారి కార్యాలయంతో సహా మరిన్ని శాఖల కార్యాలయాల కోసం జిల్లా ఏర్పాటు చేసి సంవత్సరం అవుతున్న సందర్బంగా బుధవారం ఉదయం 11 గంటల 10 నిమిషాలకు   జిల్లా కేంద్రoలోని ఎంపిక చేసిన స్థలంలో  భూమి పూజ చేపట్టడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర అటవీ, పర్యావరణ  శాఖ మంత్రి జోగు రామన్న హాజరు అయ్యి శంకుస్థాపన చేస్తారని జిల్లా పాలనాధికారి చంపాలాల్ తెలిపారు. సోమవారం తాత్కాలిక కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పాలనాధికారి మాట్లాడారు. భూమి పూజ అనంతరం అన్ని శాఖల పైన రివ్యూ మీట్ స్థానిక ప్రేమల గార్డెన్స్ లో ఉంటుందని జిల్లాలోని అన్ని శాఖల అధికారులు  హాజరు అవ్వాలని కోరారు. పాలనధికారితో జాయింట్ కలెక్టర్ అశోక్, డిఆర్డిఓ శంకర్, ఇంచార్జి డిఆర్వో రమేష్, ఆర్డీఓ రమేష్ బాబు, జిల్లా వివిధ శాఖ అధికారు ఉన్నారు.

"చేగువేరాను యువత ఆదర్శంగా తీసుకొవాలి ; ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్

"చేగువేరాను యువత ఆదర్శంగా తీసుకొవాలి-        ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్

  కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 09 :  ప్రపంచ విప్లవ కెరటం చేగువేరా అని, ఆయన  అశయాలను  యువకులు విద్యార్థులు కొనసాగించాలని  ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ అన్నారు. సోమవారం  చేగువేరా 50వ వర్ధంతి సందర్భంగా రెబ్బెనలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో చేగువేరా చిత్ర పటానికి ఏఐఎస్ఎఫ్ నాయకులు  పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం  మాట్లాడుతూ క్యూబా సోషలిస్టు విప్లవంలో తరతరాలుగా చెరిగిపోని ముద్ర వేసుకున్నాడు చే గువేరా అని,  సామ్రాజ్య వాదానికి సింహస్వప్నంగా నిలిచాడు. అందుకే గొప్ప విప్లవకారుడయ్యాడు అని అన్నారు. 1928లో అర్జెంటీనాలో ని రోసిరోలో జన్మించాడు. ఇంజనీరింగ్ విద్య చదువుతున్నప్పుడు వ్యాధిగ్రస్తుల బాధలను చూసి చలించిపోయిన చే గువేరా ఇంజనీరింగ్ విద్యని మధ్యలో నిలిపివేసి బ్యూనస్ ఎయిర్స్‌లో వైద్యవిద్య అభ్యసించాడని, చదువు పూర్తయ్యాక లాటిన్ అమెరికా అంతటా పర్యటించాడని, ఉత్తర అమెరికాలో రైతులు, బొగ్గుగని కార్మికులు పీడిత తాడిత ప్రజల దుర్భరమైన జీవితాలను, నరకయాతన చూసి చలించిపోయాడని, అమెరికా సిఐఎ ప్రోద్బలంతో జాకబ్ అర్బంజ్ ప్రభుత్వాన్ని కూల దోసిన తీరు చేగువేరా ప్రత్యక్షంగా కళ్ళారా చూసాడని, మెక్సికో వెళ్లి నియంత బాటిస్టాను కూలదోసేందుకై పోరాడుతున్న క్యూబా విప్లవకారులతో అక్కడే పరిచయాలు పెంచుకున్నాడని, చేగువేరా క్యూబా విప్లవకారులతో కలిసి విప్లవోద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడని, చేగువేరా క్రమశిక్షణ, ఏకాగ్రత, పట్టుదల గల గొప్ప సిద్ధాంతకర్త అని, క్యూబా విప్లవ అనంతరం చేగువేరా క్యూబా ప్రభుత్వంలో అనేకమైన కీలక పదవులు సమర్ధవంతంగా నిర్వహించాడని అన్నారు. పేద,బడుగు,బలహీన వర్గాల ప్రజలకు విద్య,వైద్యం,ఉపాధి హక్కులు కల్పించాలని పోరాటం చేశారని గుర్తు చేశారు. నేటి యువత చెడు వ్యసానాలకు దూరంగా ఉండి విద్య,వైద్యం,ఉపాధి హక్కుల కొరకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి పర్వతి సాయి, నాయకులు లక్ష్మణ్,నవీన్,మహేష్,శ్రీకాంత్,తిరుపతి,రవీందర్,నితిన్,మౌనిక,జ్యోతి,దివ్య తదితరులు పాల్గొన్నారు.

Thursday, 5 October 2017

అక్రమంగా కలప,ఇసుక పట్టివేత

అక్రమంగా కలప,ఇసుక పట్టివేత 


కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 05 :  అక్రమంగా తరలిస్తున్న కలప  దిమ్మలు గురువారం ఆటోలో  పంగిడి మాదారం నుంచి గోలేటి మీదుగా   తాండూర్    వైపు  ఏ  పి   01   ఎక్స్  6928  నంబర్  గల  ఆటోలో తరలిస్తుండగా డీఎఫ్ ఓ వెంకటేశ్వర్లు సమాచారమేరకు  రెబ్బన మండలం లోని గోలేటి లో మాటు వేసి స్వాధీన పరుచుకున్నట్లు అటవి క్షేత్ర అధికారి రాజేందర్ ప్రసాద్ , తెలిపారు.  వీటి విలువ వేళా  5044 రూపాయలు  ఉంటుందన్నారు, అదేవిధంగా ఏ  పి 01 ఏ  బి 1866 నెంబర్ గల  ట్రాక్టర్లో ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా అదుపులోనికి తీసుకున్నట్లు పేర్కొన్నారు.  వీరితో పేరు ఫారెస్ట్ సెక్క్షన్ ఆఫీసర్ ఎం డి అక్తరోద్దిన్ , ఎఫ్ బి ఓ లు మహమ్మద్ షరీఫ్, తిరుపతి సిబ్బంది ఉన్నారు. 

Wednesday, 4 October 2017

టి ఎస్ యూ టి ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా పాలనాధికారికి వినతి పత్రం

టి ఎస్ యూ టి ఎఫ్  ఆధ్వర్యంలో జిల్లా పాలనాధికారికి  వినతి పత్రం 

 కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 04 :   రాబోయే డి ఎస్ సీ  ని నూతనజిల్లాల ప్రకారం నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్  జిల్లాశాఖ   ఆధ్వర్యంలో బుధవారం జిల్లా  పాలనాధికారి కి  వినతి పత్రం సమర్పించారు. అనంతరం టి ఎస్ యూ టి ఎఫ్  జిల్లా ఉపధ్యక్షలు హేమంత్ షిండే మాట్లాడుతూ  జిల్లా లోని చాల పాఠశాలలో ఉపాయాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ,పాఠశాలలో విద్యావాలంటరీలతో బోధనా జరిపిస్తున్నారని, విద్యావ్యవస్థ కుంటూ పడుతుందని వివరించారు.   వినతి పత్రంలో డి ఎడ్ ,బి ఎడ్ చేసిన నిరుద్యోగులు జిల్లాలో చాలామంది డి ఎస్ సీ  కోసం నిరీక్షిస్తున్నారని,  త్వరగా దీనిని నిర్వహించి నియామక ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.  ఈ కార్య క్రమంలో ట్రెజరార్  టి రమేష్, కార్య వర్గ సభ్యులు తదితరులు  పాల్గొన్నారు. 

నట్టల మందు పంపిణి

 నట్టల  మందు పంపిణి 

కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 04 :  రెబ్బన మండలం తుంగేడ  గ్రామంలో మేకలకు, గొర్రెలకు  ఈ కాలంలో సాధారణంగా వచ్చే  వ్యాధుల నివారణ  చర్యల్లో భాగంగా బుధవారం  నట్టల  నివారణ మందులు  పంపిణి చసినట్లు పశువైద్యాధికారి డా.సాగర్ తెలిపారు . గ్రామాలలో 3062 మేకలకు గొర్రెలకు  నట్టల  నివారణ మందు పంచినట్లు తెలిపారు. ఇందులో మేకలు 966,గొర్రెలు 2096 లకు నట్టల మందులు పంచినట్లు తెలిపారు .  మొత్తం గ్రామాలలో గొర్రెలు,మేకలు  జబ్బుల బారిన పడితే తమని సంప్రదించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో  సర్పంచ్ జమిడి లక్ష్మీబాయి ,వార్డ్ మెంబర్ పాలగాని మల్లయ్య  తదితరులు పాల్గొన్నారు . 

Tuesday, 3 October 2017

రైతు సమన్వయ సమితుల కూర్పుఫై ఎం పి డి ఓ కు వినతి

రైతు సమన్వయ సమితుల కూర్పుఫై ఎం పి  డి ఓ కు వినతి

కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 03 :    జి ఓనెంబర్  39/17 మరియు 42/17  లను నిలిపివేయాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 37,42 జి ఓ  లను నిలిపివేయాలని జాక్ కన్వీనర్ ఎల్ రమేష్   రెబ్బెన ఎం పి  డి ఓ సత్యనారాయణ సింగ్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సందర్బంగా జాక్ కన్వీనర్ ఎల్ రమేష్ మాట్లాడుతూ   రైతు సమన్వయ సమితుల కూర్పు ప్రజాస్వామికంగా జరుగ లేదని  సమితులలో కౌలు,అసైన్డ్ ,పోదు చేసే రైతులకు స్థానంకల్పించకుండా,గ్రామసభలు నిర్వహించకుండా  కేవలం టి ఆర్ ఎస్ కార్యకర్తలను నామినెటే చేసి వాటినే సమితులంటున్నారని అన్నారు.  సత్యాగ్రహం జీవో 39,42 లను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకొని గ్రామ, మండల స్థాయిలో ఏర్పచిన రైతు సమన్వయ సమితులను వెంటనే రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాక్ కో కన్వీనర్ రాయల నర్సయ్య, ఏ  ఐ టి యూ సీ  సెక్రటరీ బోగే ఉపేందర్, సి ఫై ఐ మండల కార్యదర్శి రామడుగు శంకర్, ఉప కార్యదర్శి,బానోతు కిషన్ నాయక్, తదితరులు పాల్గొన్నారు. 

అప్రజాస్వామిక జి ఓ లను రద్దు చేయాలి :టి జాక్

అప్రజాస్వామిక జి ఓ లను రద్దు చేయాలి :టి జాక్ 




కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 03 :   అప్రజాస్వామికంగా జారీ చేసిన జి ఓనెంబర్  39/17 మరియు 42/17  లను వెంటనే రద్దుచేయాలని  ఆసిఫాబాడ్ మాజీ ఎం ఎల్ ఏ  ఆత్రంసక్కు , తెలంగాణ జాక్ కన్వీనర్ ఎల్ రమేష్,డి సి సి జనరల్ సెక్రటరీ విశ్వప్రసాద్ లు సోమవారంనాడు ఆసిఫాబాద్ లో ఆసిఫాబాద్ జిల్లా తెలంగాణ విద్యావంతుల వేదిక  జె  ఏ  సీ ఆధ్వర్యంలో    జరిగిన సమావేశంలో ప్రభుత్వాన్నిడిమాండ్ చేసారు. ఈ సందర్బంగా జాక్ కన్వీనర్ ఎల్ రమేష్ మాట్లాడుతూ   రైతు సమన్వయ సమితుల కూర్పు ప్రజాస్వామికంగా జరుగ లేదని  సమితులలో కౌలు,అసైన్డ్ ,పోదు చేసే రైతులకు స్థానంకల్పించకుండా,గ్రామసభలు నిర్వహించకుండా  కేవలం టి ఆర్ ఎస్ కార్యకర్తలను నామినెటే చేసి వాటినే సమితులంటున్నారని అన్నారు. ఉన్న స్థానిక  సంస్థలను బలోపేతం చేయకుండా వాటి ప్రధాన ఉద్దేశాన్ని మంటకలిపే విధంగా ఈ నూతన సమితులను తెరపైకి ప్రభుత్వం తెరమీదకు తీసుక వచ్చిందని ,, ఇప్పటికే గ్రామా స్థాయిలో చట్ట ప్రకారం వోటింగ్ పద్దతి ద్వారా ఏర్పడ్డ స్థానిక సంస్థల పాలక వర్గాలు రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువుల పంపిణి బ్యాంకు రుణాలలో సహకారం అందిస్తూ రైతుకు అండగా నిలుస్తున్నాయని, వాటిపై  ఈ  రైతు సమితులు పెత్తనం చెలాయించే వీలుందని అన్నారు. ఈ రైతు సమితులలోని సభ్యులు గ్రామాలలో  నయా పెత్తందారులుగ, జాగీర్దారులుగాతయారయ్యే అవకాశముందని అన్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన సమితులను గమనిస్తే అధికార టి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే సభ్యులుగా ఉన్నారు. దీని అర్ధం రాజ్యాంగ బద్దంగా ఉన్న సమస్తాలను నీరుగార్చడమే ప్రధాన ఉద్దేశంగా కనబడుతుందని, ఈ రాజ్యాంగ బద్ద సంస్థలకు సమాంతరంగా ప్రజల సొమ్ముతో తమపార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేస్తున్న ప్రైవేట్ సైన్యమే ఈ రైతు సమితులని అన్నారు. రైతుల ఆత్మహత్యలను నివారించడానికి ,వ్యవసాయ రంగ   తీసుకొమ్మని వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయాలనీ  హైకోర్టు ఇచిన సూచనలను పట్టించుకోకుండా తన అధికారాన్ని, అస్తిత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాలలో భాగమే ఈ సమితులని వక్తలు అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా ప్రెసిడెంట్ ఆనంద్,ప్రధాన కార్యదర్శి ఆత్మారాం, సి పి  ఐ జిల్లా కార్యదరి బద్రి సత్యనారాయణ, ,కార్యదర్శి రాయల నర్సయ్య, ప్రైవేట్ విడీసంస్తల జాక్ అధ్యక్షులు కిషన్ రావు,రైతు జాక్ గణేష్ లాల్, కిషన్ నారాయణ్ తదితరులు పాల్గొన్నారు. 

Monday, 2 October 2017

బెటర్ యూత్ బెటర్ సొసైటీ సేవా సంస్థ అద్వర్యం లో గాంధీ జయంతి

బెటర్ యూత్ బెటర్ సొసైటీ సేవా సంస్థ అద్వర్యం లో గాంధీ జయంతి 

కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 02 :    బెటర్ యూత్ బెటర్ సొసైటీ సేవా సంస్థ అద్వర్యం లో జాతిపిత మహాత్మా గాంధీ 148 వ జయంతి వేడుకలను  గోలేటి బస్టాండ్ లో  గాంధీ చిత్ర పటానికి పుల మాలలు వేసి  ఆయనను స్మరించుకున్నారు. ఈ సందర్బంగా బెటర్ యూత్ బెటర్ సొసైటీ సేవా సంస్థ అధ్యక్షుడు ఒరగంటి రంజిత్, మాట్లాడుతూ మహాత్ముని జీవితం ఈనాటి ప్రపంచ యువతకు  స్ఫూర్తి దాయకమని, ఒక్క భారతదేశమే కాకుండ ప్రపంచంలోని నాయకులూ అందరు మహాత్ముని రచనలను, జీవితాన్నిఆదర్శంగా తీసుకున్నవారేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అజయ్,ఉపాధ్యక్షులు, రవీందర్,రాజశేఖర్,  తదితర సభ్యులు పాల్గొన్నారు.  

గాంధీ మార్గమే దేశానికీ సన్మార్గం - ఉప తహసీల్దార్

 గాంధీ మార్గమే దేశానికీ సన్మార్గం   - ఉప తహసీల్దార్ 



   కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 02 :   గాంధీజీ చూపిన మార్గమే  మన దేశానికి శ్రీరామ రక్ష  అని రెబ్బెన ఉప  తహశీల్ధార్ విష్ణు   అన్నారు . సోమవారం స్థానిక రెబ్బన తహశీల్ధార్ కార్యాలయములో  148వ  మహాత్మా గాంధీ జయంతి వేడుకలను  ఘనంగా నిర్వహించారు . గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేశారు . ఆయన మాట్లాడుతూ ఈనాటి యువత సత్ప్రవర్తనతోనే  దేశప్రగతి ముడిపడి ఉందని అన్నారు.  . నవ సమాజములో యువత పాత్ర చాల ముఖ్యమని , క్రమశిక్షణతో ఉండాలని  , సమాజానికి పనికి వచ్చే పనులు  చేయాలని తెలిపారు . ఈ కార్య క్రమములో  తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ,రెవిన్యూ  ఇనస్పెక్టర్  అశోక్, వి ఆర్ ఓ ఉమ్లాల్, స్థానిక నాయకుల తదితరులు ఉన్నారు . 

గాంధీజీ అడుగు జాడల్లో నడవాలి

 గాంధీజీ అడుగు జాడల్లో నడవాలి

    కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 02 : బాపూజీ జయంతిని రెబ్బెనమండలం నంబాల గ్రామ జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్లో ఘనంగా జరుపుకున్నారు. గ్రామా సర్పంచ్ గజ్జెల సుశీల  ఆధ్వర్యంలో పాఠశాలా కమిటీ చైర్మన్  దెబ్బతి సత్యనారాయణ మహాత్ముని చిత్రపటానికి పూలమాలవేసి వందనం సమర్పించారు. గాంధీజీ అడుగు జాడల్లో నడవాలని అన్నారు .  విద్యార్థులు  క్రమశిక్షణతో చదివి సమాజ సేవలో ముందుండాలని, అప్పుడే పేరు ప్రతిష్టలు వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టి ఆర్ ఎస్ పార్టీ నాయకులూ మహావీర్ వర్డ్ మెంబెర్ సీమ జైస్వాల్, గ్రామయువకులు పర్వత సాయి, సమ్మయ్య, అరుంసై, తదితరులు పాల్గొన్నారు.