ఎమ్మెల్యేకు వినతి పత్రం
(రెబ్బెన వుదయం ప్రతినిధి) వట్టివాగు ప్రాజెక్టు కింద ఆయకట్టు కింద సాగు చేసుకుంటున్న రైతులకు సాగునీరు అందేలా చూడాలని రైతులు మరియు అధ్యక్షుడు కార్నాధం పెంటయ్య మంగళవారం నాడు ఎమ్మెల్యే కోవ లక్ష్మికి వినతి పత్రం అందజేశారు. మాట్లాడుతూ వట్టివాగు ప్రాజెక్టు కింద 2300ల ఎకరాలు సాగుభూమి ఉందని, నీరు అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నీరందకపోవడంతో వేసిన వరినాట్లు ఎండిపోయాయని దీంతో రైతులు బాదపడుతున్నారని పేర్కొన్నారు. వట్టివాగు కాలువకు శటర్లు దొంగాలేత్తుకు పోవడంతో రైతులకు నీటిని చివరి ఆయకట్టు వరకు నీరుసరిగా అందకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఇప్పటికైన పర్యవేక్షించి వెంటనే నీరందేలా చూడాలని అన్నారు. ఈకార్యక్రమంలో రైతులు వనమాల మురళి, శ్రీను, సాంబయ్య, తిరుపతి, వెంకన్న, పాపయ్య, నారయణ, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment