ఉత్తేజ క్యాథలిక్ యువత జిల్లా నూతన కార్యవర్గం ఎంపిక
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) : ఆదిలాబాద్ క్యాథలిక్ యువత జిల్లా కార్యవర్గం ఎంపిక మంచిర్యాల్ లోని పాస్కల్ సెంటర్ లో జరిగిందని ఆదిలాబాద్ జిల్లా క్యాథలిక్ యూత్ డైరెక్టర్ రెవరెంట్ ఫాదర్ రినోజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువతే రేపటి భవిత అని, యువతను సక్రమం గా దేవుని మార్గం లో నడపగలిగితే మంచి దైవ సంఘాన్ని ఏర్పరుచుకోవచ్చునని ఆయన అన్నారు. ఈ కార్యవర్గం లోని యువత నాయకత్వం వహిస్తూ ముందుండి జిల్లా క్రైస్తవ యువతను నడిపించాలని కోరారు. ఈ సందర్భంగా అందరు కలిసి మినీ క్రిస్టమస్ ను కొనియాడమని తెలిపారు. ఈ కార్యకార్యక్రమం లో ఆదిలాబాద్ జిల్లా క్యాథలిక్ యూత్ డైరెక్టర్ రెవరెంట్ ఫాదర్ రినోజ్, సహాయకులు జాయ్ సర్, జిల్లా లోని అన్ని పారిష్ ల నుండి వచ్చిన యువత ఈ ఎన్నికలో పాల్గొన్నారు .
నూతనంగా ఎంపికైన క్యాథలిక్ యువత జిల్లా కార్యవర్గం
ప్రెసిడెంట్ - జాడి ప్రశాంత్ (మంచిర్యాల్ ), వైస్ ప్రెసిడెంట్ - జాడి ప్రణవిశేష (జెండావెంకటాపూర్ ), బాయ్ రిప్రేసేన్టేటివ్ - రత్నం వివేకానంద్ (రేప్పెల్లెవాడ ), గర్ల్ రిప్రేసేన్టేటివ్- పసల దీప (బెల్లంపల్లి ), స్పోక్స్ పర్సన్ - డి.కరుణాకర్ (మందమరి ), జెనరల్ సెక్రెట్రీ - గంధం. శ్రీనివాస్ (గోలేటి ) , వైస్ సెక్రెట్రీ- జె. అనిత (గోలేటి )
ట్రెజరర్ - రామ్టేన్కి.శ్యాం (యేసయ్య పల్లె)
No comments:
Post a Comment