తెలంగాణా ఉద్యమకారుల సమావేశాన్ని విజయవంతం చేయాలి
తెలంగాణా తూర్పు జిల్లా ఉద్యమకారులను ఆసిఫాబాద్ లో జరిగే సమావేశాన్ని విజయవంతం చేయాలనీ డివిజన్ కో కన్వీనర్ తోట లక్ష్మన్ అన్నారు . రెబ్బెన అతిధి గృహంలో శుక్రవారం నాడు విలేకరి సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణా రాష్ట సదన కోసం ఉద్యమాలు చేసి ఆర్దికంగా అన్ని రకాలుగా నష్ట పోయాన ఉద్యమకారులను ఆదుకోవాలన్నచర్చలపై ఆసిఫాబాద్ ఈ నెల ఆదివారం 27న జరిగే ఈ సమావేశానికి జిల్లా కమిటిని ఎన్నుకోవడం జరుగుతుందని ఉద్యమకారుల న్యాయమైన కోరికలపై చర్చలు జరుగుతాయని కావున ఈ సమావేశానికి ఉద్యమకారులు ఆదిక సంఖ్యలో తరలి వచ్చి ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలనీ కోరారు ఈ కార్యక్రమములో మండల అధ్యక్షుడు దుర్గం రవీందర్, ప్రధాన కార్యదర్శి వినోద్ జైశ్వాల్,ఉపాధ్యక్షుడు వనమాల ఫణికుమార్, కార్యదర్శులు జుమ్మిడి రాజేష్,కుందారపు శంకరమ్మ,ఉద్యమకారులు నవీన్ కుమార్ జైశ్వాల్,చిరంజీవి గౌడ్,దుర్గం భరద్వాజ్ తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment