Friday, 30 September 2016

విద్యార్థి దశ నుండే సమాజ సేవ అలవర్చుకోవాలి

విద్యార్థి దశ నుండే  సమాజ సేవ అలవర్చుకోవాలి 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); విద్యార్థి దశ  నుండే సమాజ సేవ ను అలవర్చుకోవాలని సాయి విద్యాలయం ఇంగ్లిష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ ఢీకొండ  విజ కుమారి అన్నారు . రెబ్బెన సాయి  విద్యాలయం ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో  మంచిర్యాలలో డైమండ్ చారిటబుల్ ట్రస్ట్ స్వాచ్చ్చంద సంస్థకు , పేద విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కలిసి     8025 రూపాయలు నగదును ఆ సంస్థ సభ్యుడు నాగరాజు కు అందచేశారు. అనంతరం  పాఠశాల ప్రధాన ఉపాద్యాయుడు డికొండ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ  మన కోసం మనం కాకుండా ఇతరులకు సహాయం చేయడములో ముందుకు రావాలని తెలిపారు . పేద విద్యార్థుల కోసం సహాయం చేయుటలో మా పాఠశాల విద్యార్థులు  ముందంజలోఉన్నారని   అన్నారు.  ఈ సందర్భముగా ట్రస్ట్ సోషల్ వర్కర్ నాగరాజు,పాఠశాల ఉపాధ్యాయులు రాజన్న, తిరుపతి ,సుజాత ,మల్లీశ్వరి ,విద్యాసాగర్ ,రేష్మ, ఉష, వినిత,ఆశలతో విద్యార్థులు పాల్గొన్నారు

No comments:

Post a Comment