Friday, 23 September 2016

ఐకెపి విఓఏ ల సమస్య ల పై వినతి


ఐకెపి విఓఏ ల సమస్య ల పై  వినతి 



రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ఐకేపీ విఓఏ సమస్యలను నెరవేర్చకుండ చాలీచాలని బకాయి జీతాలతో నిరంతరం అన్ని రకాల పనులు చేయించుకుంటూ వేతనాలు చెల్లించకుండా అన్యాయం చేస్తూ  రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని  ఐకెపి విఓ ఏ ల  మండల అధ్యక్షులు  గజ్జెలి భీమేష్ అన్నారు. గురువారం నాడు గౌతమి మండల సమాఖ్య రెబ్బెన కార్యాలయంలో జనరల్ బాడి సమావేసంలో ఏరియా కోఆర్డినేటర్ అన్నాజీ ముఖ్యఅతిధి గా పాల్గొన్నారు ఈ సమావేశం లో గౌతమి మండల సమాఖ్య అధ్యక్షురాలుఎపియం వెంకటరమణ కు వినతిపత్రం  అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండ చాలీచాలని బకాయి జీతాలతో నిరంతరం అన్ని రకాల పనులు చేయించుకుంటూ వేతనాలు చెల్లించకపోవడం అన్యాయం అన్నారు . గ్రామాల్లో  విఓఏ లు స్వయం సహాయక సంఘాల పనులతో పాటు డిపార్ట్ మెంట్ కు సంబందించిన ఇంకా ఇతర అనేక పనులు నిర్వహిస్తున్నారు . వీరికి నెలకు 2000/-ల చొప్పున చెల్లిస్తామని 2013 మే 30 న సెర్ప్ నుండి సర్క్యులర్ జారీ అయింది . కానీ నేటికీ వేతనాలు విడుదల కాలేదన్నారు , స్వయంగా ముఖ్యమంత్రి ఎన్నికల సందర్బంగా అనేక సభల్లో విఓఏ లకు వేతనం 5000/-రూ లకు పెంచుతామని ప్రకటించారు . ఇచ్చిన హామీలను అమలు చేసి విఓఏ ల  న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరారు .డిమాండ్స్  :- 2013 జూన్ నుండి 40 నెలల బకాయి వేతనాలు చెల్లించాలి , ప్రభుత్వం ఎన్నికల సందర్బంగా పెంచుతానన్న రూ. 5000/-లు వేతనం పెంచాలి, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి ,ఆరోగ్యబీమా సదుపాయం కల్పించాలి ,సెర్ప్ హెచ్ . ఆర్  ను వర్తింపచేయాలి ,సంఘాలకు వి ఎల్ ఆర్ వడ్డీలేని రుణాలు 10 లక్షల వరకు పొడిగించాలి ,చనిపోయిన విఓఏ కుటుంబాల సభ్యులకు ప్రమాద బీమా అమలు చేయాలనీ డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో డోంగ్రీ తిరుపతి , క్రిష్ణ , శ్రీకాంత్ , రవి , లింగయ్య ,శ్రీనివాస్ , ,శంకర్ ,చంద్రశేఖర్ ,ch తిరుపతి, సులోచన ,రాజేశ్వరి ,ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment