ఉత్తమ ఉపాధ్యాయులకు ఘానా సన్మానం

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలములో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఉపాధ్యాయులను పి ఆర్ టి యూ రెబ్బేన శాఖా ఆధ్వర్యములో ఘనంగా శాలువాలతో సన్మానించారు. ఉత్తమ ఉపాధ్యాయులు ఎం శంకర్ రావు (నావెగామ్ ), ఎం ఫ్లోరెన్స్ ( కొత్తగూడెం ) లను మండల విద్యాధికారి ఎం వెంకటేశ్వర్ల తో సహా ఉపాధ్యాయులు సన్మానించారు. ఈ సందర్బంగా ఎం ఈ ఓ వెంకటేశ్వర స్వామీ మాట్లాడుతూ ఉపాధ్యాయులు అంకిత భావముతో తమ వృత్తికి న్యాయం చేస్తే ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుందని అన్నారు. ఈ కార్య క్రమములో రాష్ట్ర కార్యదర్శి కె జనార్దన్, జిల్లా ఉపాధ్యాయులు బి సదానందం, మండల అధ్యక్షుడు ఎస్ కె ఖాదర్, ప్రధాన కార్యదర్శి డి రవి, పి జి ఎహ్ ఎం స్వర్ణ లతా జిల్లా కౌన్సిల్ సభ్యులు ఎస్ వెంకటేశం, కె శ్రీనివాస్ లు ఉన్నారు.
No comments:
Post a Comment