ఎమ్పిడివో అభివృద్ధి పనులకు ఆటంకం- గోలేటి సర్పంచ్ లక్ష్మన్
రెబ్బెన: (వుదయం ప్రతినిధి);; రెబ్బెన మండల ఎమ్పిడివో ఎంఎ హలీం ఆహివ్రుద్ధి పనులకు ఆటంకంగా మారారని గోలేటి సర్పంచ్ లక్ష్మన్ మంగళవారం ఎమ్పిడివో తో వాగ్వాదానికి దిగారు. ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధి పనులు గ్రామ సర్పంచ్ లకు తెలియకుండా, గ్రామ సభలు ఎలా నిర్వహిస్తారని అన్నారు. సర్పంచ్లు గ్రామాలకు ప్రాతినిధ్యం వహిస్తారని కనీసం సర్పంచ్లకు కనీసం ఆభివ్రుద్ది పనుల సమాచారం ఇవ్వటం లేదని అన్నారు. దీంతో మాకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని అన్నారు. మీరో మండల అభివృద్ధి అధికారి మండలాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి కోసం కార్పోరేషన్ రుణాలు ప్రవేశ పెడితే అవి ధనవంతులకే అంట గట్టడం ఎంత వరకు సమంజసమని అన్నారు . ఈయనతో పాటు కిస్టాపూర్ సర్పంచ్ భీమేశ్ ఉన్నారు .
No comments:
Post a Comment