జాతరకు ముస్తాబవుతున్న గంగాపూర్ ఆలయం
జాతర ఏర్పాట్ల పరిశీలిస్తున్న రెబ్బెన ఎస్ ఐ దారం సురేష్
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామ శివారులోని బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 21 నుండి 23 వరకు జాతర నిర్వ హించుచున్నారు . ఈ మేరకు అధికారులు పనులు ఏర్పాటు చేసారు. గంగాపూర్ జాతర ఏర్పాట్ల రెబ్బెన ఎస్.ఐ దారం సురేష్ ఆలయ ఈ .ఓ .బాపిరెడ్డి అడిగి తెలుసుకున్నారు ప్రతి ఎటా మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మూడు రోజుల పాటు జాతర నిర్వహించనున్నారు.ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు.అదివారం కళ్యాణ మహోత్సవాన్ని జరిపేOదుకు అన్ని ఏర్పాట్లు చేసామని ఆలయ ఈ .ఓ .బాపిరెడ్డి అద్వర్యం లో ఆలయంలో ఏర్పాట్లు చేసారు . ఈ నెల 22న మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సాయంత్రం 5 గంటలకు రథోత్సవం నిర్వహిస్తారు . ఉత్సవ విగ్రహాలను అలంకరించి రథంఫై ఊరేగిస్తారు. భక్తుల సౌకర్యలకోసం ఆసిఫాబాద్ ,మంచిర్యాల డిపోల నుంచి ఆ ర్ . టి . సి . అధికారులు ప్రత్యేక బస్సు లను ఏర్పాటు చేస్తున్నారు .
No comments:
Post a Comment