ఉచిత బాక్సింగ్ శిక్షణ శిబిరాలు,, కార్యవర్గం ఎన్నిక
క్రీడలు పట్టణాలకే పరిమతం కాకుండా గ్రామీణ ప్రాంతాలలో ఉచిత బాక్సింగ్ శిక్షణ శిబిరాలు ప్రారంభిస్తున్నామని జిల్లా బాక్సింగ్ సంఘం కార్యదర్శి పాదం మహేందర్ అన్నారు. బుదవారం నాడు రెబ్బెన అతిధి గృహంలో విలేకరుల సమావేశములో ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో కూడా బాక్సింగ్ క్రీడని అభివృద్ధి పరచాలనే ప్రధాన ఉద్దేశ్యంతోనే శిక్షణ కేంద్రాలను అన్ని మండల కేంద్రాలలో ఏర్పాటుచేస్తున్నామని అన్నారు.అనంతరం రెబ్బెన మండల బాక్సింగ్ క్లబ్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు రెబ్బెన బాక్సింగ్ క్లబ్ అధ్యక్షుడు టి శ్రీనివాస్, ఉప అద్యక్షుడు యం.తిరుపతి, కార్యదర్శి యం.శ్రీనివాస్, ఉపకార్యదర్శి టి.నరేష్, గౌతం, పి. శ్రీనివాస్ లను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు
No comments:
Post a Comment