Saturday, 28 November 2015

రెబ్బెనలో ఘనంగా రాజీవ్‌ ఖేల్‌ రత్న అభియాన్‌



రెబ్బెనలో ఘనంగా
 రాజీవ్‌ ఖేల్‌ రత్న అభియాన్‌ 



(రెబ్బెన వుదయం ప్రతినిధి); 
రాజీవ్‌ ఖేల్‌ రత్న  అభియాన్‌ పోటీలు శనివారం  రెబ్బెన మండ కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ పోటిలలో మండలం లోని అన్ని పాటశాలల విద్యార్థిని విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు. ఈ పోటిలలో వివిధ క్రీడలు  వాలీబాల్‌, ఖోఖో,  కబడ్డీ నిర్వహించగా విద్యార్థులు చక్కని ఆటతీరుతో తమ ప్రతిభను ప్రదర్శించారు.ఈ పోటిలలో గెలుపొందిన విద్యార్థులకు యం.పి.డి.ఓ  యం.ఎ అలీమ్ భాహుమతులు ప్రధానం చేయటం జరిగింది. ఈ కార్యక్రమం లో రెబ్బెన  యం.పి.డి.ఓ మాట్లాడుతూ విద్యార్థులకు మానసిక వికాసాన్ని అందించే క్రీడలకుకవలసిన ప్రోస్తహకలను కల్పించటానికి తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో డిప్యుటి తహశీల్దార్ రామ్మోహన్ రావు, ఎస్ ఐ  టి వి రావు , యం ఈ ఓ  వెంకటేశ్వర్లు. ఏ పి యం రాజ్ కుమార్, నవీన్ జైస్వాల్, చిరంజీవి,  పెసరు వెంకటమ్మ,  మదునయ్య  తదితర అధికారులు పాల్గొన్నారు

ప్రోటోకాల్ పాటించని అధికారులు 

రాజీవ్ గాంధి ఖేల్ అభియాన్ పోటిలలో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని మండల కో ఆప్షన్ సభ్యుడు జాకీర్ ఉస్మాని  అన్నారు. ఈ  పో టీ లకు  వచ్చిన విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడంలో అధికార్లువిఫలమయ్యారని  అన్నారు. పోటీలకు తయారు చేసిన మైదానాన్ని చదును కూడా చేయలేదని అన్నారు.  

No comments:

Post a Comment