Sunday, 29 November 2015

ఘనంగా తెలంగాణా దీక్షా దివస్

ఘనంగా తెలంగాణా దీక్షా దివస్



(రెబ్బెన వుదయం ప్రతినిధి)రెబ్బెన మండల కేంద్రంలో తెరాసా ఆధ్వర్యంలో తెలంగాణా దీక్షా దివస్ కార్యాక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు ఆమరణ నిరహరదీక్ష వల్లనే తెలంగాణ సిద్దించిందని జడ్పిటిసి బాబురావు అన్నారు. ఆదివారం రెబ్బెన మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ఆరుదశాబ్ధాలుగా జరిగిన తెలంగాణ ఉద్యమంలో అప్పటి ప్రభుత్వం ఏ మాత్రం చలించలేదన్నారు. మలి ఉద్యమంలో

 కేసిఆర్‌ మొదలుపెట్టి 2009 నవ ంబర్‌ 29న ఆమరనిరహర దీక్ష చేపట్టారన్నారు. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం 

మరుసటి నెల డిసెంబర్‌ 9న తెలంగాణ ప్రకటన చేసిందని గుర్తుచేశారు. ఆ తర్వాత జరిగిన తెలంగాణ ఏర్పాటు 


కారణంగా ఉద్యమాలు చేశారన్నారు. కొందరు మావల్లే తెలంగాణ వచ్చిందని ప్రచారం చేయడం పరిపాటిగా 


మారిందన్నారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటుచేసి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశంలోనే 


తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో మొదటివరుసలోనిలిచిన ఘనత కేసిఆర్‌కే దక్కిందన్నారు. ముఖ్యంగా సాగు, 


తాగునీరు, విద్యా, సంక్షేమ పథకాలు, బీడి, గీతా, చేనేత కార్మికులకు కూడా పెన్షన్‌ కల్పించడంలో టీఆర్‌ఎస్‌ 


ప్రభుత్వం నిమగ్నమైందన్నారు. ఇన్ని చేసినా కూడా ప్రతిపక్షాలు విమర్శించడం సరికాదన్నారుఈ కార్యక్రమంలో , ఎంపిపి కార్నాధం సంజీవ్ కుమార్, వైస్ ఎంపీపీ గోడుసేల రేణుక, అన్ని గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటిసి లు, జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ జైశ్వాల్, మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ రాపర్తి అశోక్, మహమ్మద్ జమీర్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి కుందారపు శంకరమ్మ, టి,ఆర్,ఎస్ నాయకులు పాల్గొన్నారు..

No comments:

Post a Comment