Saturday, 2 May 2015

వేకువజామున లారి కలకలం




రెబ్బన మండలంలో శనివారం రోజున ప్రధాన  రహదారి గుండా వెళ్తున్న లారి నం. ఎపి29u2579 లైన్ బండి ఇనుప లోడ్ తో వెళ్ళే లారి రోడ్ కి 30 ఫీట్ దూరంలో ఉన్న 3 షాపులను  ద్వంసం చేసినది. మొదట రోడ్ పక్కనే ఉన్న చెట్టు కొమ్మను  తగిలి, రోడ్ పక్కన  ఉన్న మోటార్ సైకిల్ మెకానిక్ మల్లేష్ షాపు ముందు ఉన్నరేకుల షడ్డుకు డీకొట్టి  పక్కషాపు దుర్గారావు లారి గ్యరెజిలో చొరబడి పక్కనే ఉన్న శ్రీరాజేశ్వర వెల్డింగ్ వర్క్స్ షాపులోకి దుసుకేల్లింది. స్థానికులు చెప్పిన ప్రకారంగా రాత్రి 3 గంటల సమయంలో జరిగింది. రోడ్ పక్కనే పెద్ద శబ్దం రావడంతో మెకానిక్ మల్లేష్ వచ్చిచూడగా,లారి ఇరుక్కు పోయి ఉన్నది అని లారి చూసినానని చెప్పాడు. డ్రైవర్, క్లీనర్ పరారిలో ఉన్నారు. సంఘటన తెల్లవారుజామున జరగటం వలన ప్రాణ నష్టం జరగలేదు కాని ఆస్థి నష్టం జరిగింది.  

No comments:

Post a Comment