Wednesday, 14 October 2015

ఘనంగా నిరవహిస్తున్న దేవీ నవరాత్రోత్సవాలు

ఘనంగా  నిరవహిస్తున్న దేవీ నవరాత్రోత్సవాలు

రెబ్బెన మండలంలోని పలు గ్రామాల్లో దేవీ నవరాత్రోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దసరా పండుగ సందర్భంగా సకల దేవతా స్వరూపిణి...జగన్మాతను భక్తి శ్రద్దలతో సహస్త్ర నామాలతో వివిధ రకాల పూజలతో వేద మంత్రాల సాక్షిగా శ రన్నవరాత్రోత్సవాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా మండలం లోని గంగాపూర్లో గల వెంకటేశ్వర స్వామి మరియు ఆంజనేయ స్వామి ఆలయంలో, ఇంద్రానగర్లో గల  ఆలయంలో కనకదుర్గమ్మ వారి దసరా నవరాత్రులను ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. నేటి నుండి 9 రోజుల పాటు ఈ నరవరాత్రోత్సవాలు నవరూపాలుగా జరగనున్నాయి.ఈ కార్యక్రమంలో ఇంద్రానగర్ వినోద్ స్వామి,మాధవ్ సంజీవ్,ఇస్తారి,సాయి,సురేష్,సంతోష్ మండలంలో ప్రజలు కనకదుర్గమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. 

No comments:

Post a Comment