తమ న్యాయపరమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించాలని గాంధి జయంతిని ఘనంగా నిర్వహించి అనంతరం గాంధీ చిత్రపటానికి శుక్రవారం ఆశావర్కర్లు వినూత్నగా వినతిపత్రం ఇచ్చి తమ సమస్యను పరిష్కారమయ్యేలా చూడాలని కోరారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు అనిత మాట్లాడుతూ నేటి సమాజంలో పెరుగుతున్న కూరగాయల ధరలు, నిత్యావసర వస్తువులకు అనుగుణంగా ప్రభుత్వం తమ వేతనాలను పెంచాలని, లేదంటే తమ పరిస్థితి అగమ్య గోచరంగా తయారై వీధుల పాలవుతాయని, అర్హులైన వారిని ఏ,ఎన్,ఎం లుగా గుర్తించాలని, రెబ్బెన ప్రాథమిక చికిత్స కేంద్రం ముందు ఆశ కార్యాకర్తల సమ్మె నేటికి 31 రోజులు అవుతున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనం రాకపోవడం విడ్దూరంగా ఉందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, తెదేపా మండల అధ్యక్షుడు మోడెం సుదర్శన్ గౌడ్, శంకర్, ఆశావర్కర్ల సంఘం అధ్యక్షురాలు అనిత, ఉపాధ్యక్షురాలు రమ, భాగ్య, సునీత, సుజాత, తిరుమల, నీర్మల, రాజేశ్వరి, రాధ, లక్ష్మీ, ఛాయా, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment