వంట వార్పు చేసి నిరసన తేలిపిన ఆశ కార్యకర్తలు
ఆశా కార్యకర్తలు ఆదివారం నాడు రెబ్బెనలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కార్యాలయం ముందు సమ్మెలో భాగంగా వంట వార్పు చేసి నిరసన వ్యక్తం చేసారు. సీ,అయ్,టీ,యు మండల అధ్యక్షురాలు ఆశ కార్యకర్త అనిత మాట్లాడుతూ ఉద్యోగ భద్రత, పదోన్నతులు కల్పించాలని, కనీస వేతనం రూ. అర్హులైన వారిని ఏ,ఎన్,ఎం లుగా గుర్తించాలని, 33వ రోజులా వరకు చేరినా కూడా ప్రభుత్వం తమ కష్టాలు పట్టించుకోకపోవడం దుర దృష్టకరమని అన్నారు . గ్రామీణ స్థాయిలో పనిచేసే వైద్యసిబ్బందితో విధులు నిర్వహిస్తున్నప్పటికి ఉద్యోగ భద్రత కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు రోగులకు వైద్యసేవలు అందించినప్పటికీ కనీస వేతనం తో తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు రమ, ఆ సంఘం కార్యకర్తలు కవిత,స్వప్న, తిరుమల, ఛాయ ,రాజేశ్వరి, నిర్మల, రమాదేవి, లక్ష్మీ,సుజాత, సునీత, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment