Saturday, 1 December 2018

ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం

 
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, ; ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజమని పి  అర్  టి యు  కొమురం భీమ్ జిల్లా అధ్యక్షులు ఎటుకురి. శ్రీనివాస్ అన్నారు. శనివారం రెబ్బెన మండలం  తక్కలపల్లి గ్రామంలోని  ఉన్నత పాఠశాలలోపనిచేస్తున్న ఉపాధ్యాయురాలు  శ్రీమతి హనుమాండ్ల విజయ లక్మి  పదవి విరమణ సన్మాన సభకి ముఖ్య అతిధి గా హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ  ఆమె పాఠశాలలో చేసిన సేవలను కొనియాడుతూ   శేష జీవితం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో గడపాలని అన్నారు . పదవి విరమణ చేసిన ఉపాధ్యాయురాలును  పి  అర్  టి యు టి ఎస్    రెబ్బెన మండల శాఖ పక్షాన ఘనబగా సన్మానించడం జరిగింది.   ఈ కార్యక్రమంలోమండల విద్యాధి కారి వెంకటేశ్వర స్వామి,  జిల్లా మాజీ అధ్యక్షులు డి.నారాయణ రావు,జిల్లా ఉపాధ్యక్షులు సదానందం,ఖాదర్,రాష్ట్ర ఉపాధ్యక్షులు కల్వల శంకర్,మండల అధ్యక్షులు ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి యస్.అనిల్ కుమార్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment