కోమురం భీంమ్ రెబ్బెన డిసెంబర్ 25 : ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలోకటిక జలపాతం వేదికగా జనవరిలో జరగబోయే ప్రపంచ స్థాయి వాటర్ రాప్లింగ్ సాహస క్రీడా పోటీల్లో రెబెనా మండలానికి చెందిన ముగ్గురు విద్యార్థులకు పాల్గొనే అవకాశం లభించినట్లు ఉమ్మడి జిల్లా అడ్వెంచర్ క్లబ్ ఇంచార్జి అభినవ సంతోష్కుమార్ తెలిపారు మండల కేంద్రంలోని రెబ్బెన ఆర్ట్ సైన్స్ డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్న జరుపుల రవీందర్తో పాటు మంచిర్యాల ఎవిఎన్ డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్న రాజుల రాజ్కుమార్ రెబ్బన ప్రభుత్వకళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్న రాజుల శ్రీకాంత్లు జనవరి పదకొండు నుండి పధ్నాలుగు వరకు కటికి జలపాతం వద్ద నిర్వహించే అడ్వెంచర్ పోటీలలో పాల్గొన బోతున్నట్లు తెలిపారు. ఉవ్వెత్తున క్రిందకు దూకుతున్న జలధారలలో తడుస్తూ తాడు సహాయంతో పైనుండి పైనుండి (స్టేట్ పాయింట్) వరకు జలధారలతో పోటీ పడుతూ కిందుకు చేరాల్సి ఉంటుందన్నారు. స్త్రీ పురుషుల్లో 18 ముంది 50 సంవత్సరాల వయసు వారు వెటరన్ విభాగంలో , స్త్రీ పురుషుల విభాగంలో 50 నుండి 70 సంవత్సరాల వరకు పన్నెండు రకాల సాహస క్రీడా పోటీల్లో పాల్గొనవచ్చని తెలియ తెలిపారు. మొదటిసారిగా జరుగుతున్న ప్రపంచ రాప్లింగ్ పోటీలకు రెబ్బెన మండలంలోని ముగ్గురు యువకులు ఎంపికవటం పట్ల మండల వాసులు హర్షం వ్యక్తం చేశారు పోటీలకు ఎంపికైన విద్యార్థులను ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించారు.
No comments:
Post a Comment