కోమురం భీంమ్ రెబ్బెన డిసెంబర్ 25 : రెబ్బెన మండలంలోని అన్ని గ్రామాలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. రెబ్బెన మండల కేంద్రంలోని అగాపే షాలోమ్ చర్చి, గోలేటి గ్లోరియస్ చర్చ్ , నంబాల, గంగాపూర్ చర్చిలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. విశ్వ మానవాళికి తన ప్రేమ తత్వం తో వెలుగులు నింపిన కరుణమయుడు ప్రేమ మూర్తి క్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా రెబ్బెన మండలం లో గోలేటి లోని గ్లోరియస్ చర్చ్ లో బెటర్ యూత్ బెటర్ సొసైటీ స్వచ్చంధ సేవా సంస్థ ఆద్వర్యంలో కుల మతాలకు అతితంగా కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు జరిపినట్లు సంస్థ అధ్యక్షులు ఓరగంటి రంజిత్ తెలిపారు. . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ సందర్భంగా చలి కాలం దృష్టిలో పెట్టుకొని పేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో ఫాస్టర్ తిమోతి మరియు సంస్థ ప్రధాన కార్యదర్శి గజ్జెల సత్యనారాయణ, ఉపాధ్యక్షులు రవీందర్,రాజశేఖర్ సభ్యులు బలుగురి తిరుపతి, రాజశేఖర్,పెంటపర్తి తిరుపతి,కృష్ణ, ఏగ్గె తిరుపతి, అఖిల్ , పస్తం పోశం తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment