కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, డిసెంబర్ 14 ; కల్వకుంట్ల తారక రామా రావు తెరాస పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని చేపట్టిన సందర్బంగా రెబ్బెన మండలం గోలేటి లో టి ఆర్ ఎస్ వి కొమురంభీం జిల్లా అధ్యక్షులు మస్కు రమేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పదవికి కేటీర్ ను ఎంచుకున్నందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. తెరాస పార్టీ కేటీర్ నాయకత్వంలో మరింత ప్రజాదరణ పొందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్వతి అశోక్, సోంశెట్టి శశి, లాక్సేటి రవీందర్, పోతురాజుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment