Friday, 14 December 2018

కేటీర్ పదోన్నతిపై తెరాస శ్రేణుల సంబరాలు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, డిసెంబర్ 14  ; కల్వకుంట్ల తారక రామా రావు  తెరాస పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని చేపట్టిన   సందర్బంగా రెబ్బెన మండలం  గోలేటి లో  టి ఆర్ ఎస్ వి  కొమురంభీం  జిల్లా అధ్యక్షులు మస్కు రమేష్   ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పదవికి కేటీర్  ను ఎంచుకున్నందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. తెరాస పార్టీ కేటీర్  నాయకత్వంలో మరింత ప్రజాదరణ పొందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమంలో  పార్వతి అశోక్, సోంశెట్టి శశి, లాక్సేటి రవీందర్, పోతురాజుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment