Wednesday, 26 December 2018

ఘననఁగా సి పి ఐ 94 వ ఆవిర్భావ వేడుకలు

కోమురం భీంమ్ రెబ్బెన  డిసెంబర్ 26 : సిపిఐ పార్టీ  94 వ ఆవిర్భావదినోత్సవాన్ని  రెబ్బెన మండలంలోని  సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.  పార్టీ జెండాను సిపిఐ మండల కార్యదర్శి రాయిల్ల నర్సయ్య ఎగరవేశారు ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బోగే ఉపేందర్,  మండల కార్యదర్శి రాయిల్ల నర్సయ్య,  ఎఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి దుర్గం రవీందర్ లు  మాట్లాడారు. పోరాటాల ద్వారానే హక్కులు సాధించుకోవాలని ,  పేద ప్రజల హక్కులను కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న పార్టీ సిపిఐ అని,  పార్టీ ఆవిర్భవించి 94  సంవత్సరాలు కావస్తున్నది ఆనాటి నుంచి  ఈ నాటి వరకు కేవలం ప్రజల సంక్షేమం కోసం ప్రజల సమస్యల పరిష్కారం ప్రజల హక్కుల కోసం ఎన్నో ఉద్యమాలు చేస్తున్నదని అన్నారు.  ఎన్నికలహామీలుఅమలులోప్రభుత్వాలుఘోరంగావిఫలమయ్యాయని,  రాబోయే పంచాయతీ ఎన్నికల్లో సిపిఐ అన్ని గ్రామాల్లో పోటీ చేస్తున్నదని కావున  ప్రజలు పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు కస్తూరి రవి కుమార్, జి పి   వర్కర్ యూనియన్ మండల కార్యదర్శి దుర్గం వెంకటేష్,  వైస్ ప్రెసిడెంట్ శంకర్ లాల్ సింగ్,  నాయకులు బెల్లూరి రాజేష్,  ఆర్ శంకర్,  గుర్రపు గంగయ్య, గౌస్ ఖాన్,  మహేష్ తదితరులు  ఉన్నారు.

No comments:

Post a Comment