కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, డిసెంబర్ 15 ; రెబ్బెన మండలం ఇందిరా నగర్ గ్రామంలోని ప్రాధమిక పాఠశాల మేనేజ్ మేంట్ కమిటీ సమావేశం కన్వీనర్ దొడ్డిపట్ల రవికుమార్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో పాఠశాల మౌలిక వసతులు , మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ , విద్యార్థుల హాజరు శాతం, చదువులో వెనుక బడిన విద్యార్థుల ప్రగతి కై తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎం సి సభ్యులు అనిత,అమ్మక్క , తార, ఇందిరా, లక్ష్మి, సరోజ, రజిత , సుజాత, సునీతా, రాందాస్, శంకర్, వెంకటేష్, సి అర్ పి దేవేందర్, అంగన్వాడీ టీచర్ తిరుపతమ్మ, ఉపాధ్యాయులు కవిత, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment