Friday, 14 December 2018

గుడుంబా స్థావరాలపై దాడులు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, డిసెంబర్ 14  ; రెబ్బెన మండలం దేవులగుడ    గ్రామంలోని పత్తి  చేలలో శుక్రవారం  ఖచితమైన సమాచారం మేరకు  ఎస్సై విజయలక్ష్మి ఆధ్వర్యంలో  మద్యపాన నిషేధ శాఖ అధికారులు దాడి చేసి  గుడుంబా తయారీ  స్థావరాలను ధ్వంసం చేసినట్లు  ఆబ్కారీ   ఎస్సై   విజయలక్ష్మి  తెలిపారు.   తయారీ కంద్రాలలో 50  లీటర్ల బెల్లం పానకం, 5 లీటర్ల గుడుంబా  నుస్వాధీనపరచుకున్నట్లు తెలిపారు. రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.   ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటువంటి నిషేదిత మద్యాలను తయారీ చేయకూడదని అన్నారు. చట్టాన్ని అధిగమించిన వారికి కఠిన శిక్షలు ఉంటాయని అన్నారు. నిషేదిత మద్యం తరిపై సమాచారం ఇవ్వదలచినవారు 08735 277017 నెంబర్ పై సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యం గా ఉంచబబడతాయని తెలిపారు.  ఈ దాడులలో  కానిస్టేబుల్   తిరుపతి, సురేష్, తిరుమల,మమత,  తదితర సిబ్బంది ఉన్నారు.

No comments:

Post a Comment