Wednesday, 19 December 2018

పదవీవిరమణ చేస్తున్న అధికారికి సన్మానం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, డిసెంబర్ 19 ; బెల్లంపల్లి ఏరియా గోలేటి జీఎం  కార్యాలయంలో జనరల్ మేనేజర్ సేఫ్టీ గా పనిచేస్తున్న వసంత్ కుమార్ ఈ నెల ముప్పై ఒకటి న  పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా  వారిని బుధవారం జిటిసీఓఏ క్లబ్ లో జీఎం  కే  రవిశంకర్ ఏరియా ఉన్నతాధికారులతో కలిసి ఘనంగా సన్మానించారు . ఈసందర్భంగా జీఎం కె రవిశంకర్ మాట్లాడుతూ వసంత్ కుమార్ సింగరేణిలో పలు ఏరియాల్లో పనిచేసే సింగరేణికి తమ సేవలు అందించారని తెలిపారు  వసంత్ కుమార్ ను  శాలువ సత్కరించారు.   ఈ కార్యక్రమంలో ఎస్వోటు జిఎం సాయిబాబా సిఎంఓఎఐ ప్రెసిడెంట్ సిట్ శ్రీనివాస్,  ప్రాజెక్టు ఆఫీసర్ పురుషోత్తం రెడ్డి,  డిజిఎం పర్చేస్ రావుజీ,  డిజిఎం పర్సనల్ జె కిరణ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment