కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, డిసెంబర్ 19 ; బెల్లంపల్లి ఏరియా గోలేటి జీఎం కార్యాలయంలో జనరల్ మేనేజర్ సేఫ్టీ గా పనిచేస్తున్న వసంత్ కుమార్ ఈ నెల ముప్పై ఒకటి న పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా వారిని బుధవారం జిటిసీఓఏ క్లబ్ లో జీఎం కే రవిశంకర్ ఏరియా ఉన్నతాధికారులతో కలిసి ఘనంగా సన్మానించారు . ఈసందర్భంగా జీఎం కె రవిశంకర్ మాట్లాడుతూ వసంత్ కుమార్ సింగరేణిలో పలు ఏరియాల్లో పనిచేసే సింగరేణికి తమ సేవలు అందించారని తెలిపారు వసంత్ కుమార్ ను శాలువ సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జిఎం సాయిబాబా సిఎంఓఎఐ ప్రెసిడెంట్ సిట్ శ్రీనివాస్, ప్రాజెక్టు ఆఫీసర్ పురుషోత్తం రెడ్డి, డిజిఎం పర్చేస్ రావుజీ, డిజిఎం పర్సనల్ జె కిరణ్ తదితర అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment