కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, డిసెంబర్ 30: రెబ్బెన మండలంలోని ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని రెబ్బెనఎస్సై దీకొండ రమేష్ సూచించారు. ఆదివారం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డిసెంబర్ 31 న మద్యం దుకాణాలను దుకాణం దారులు నిర్ణీత సమయంలో లోపం మూసివేయాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజల కు అసౌకర్యం కలిగించినా, కాలిబాటల్లో మద్యం సీసాలను పగలగొట్టిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ముఖ్యంగా యువత మద్యం సేవించి వాహనాలు నడిపి హంగామా సృష్టించినా చర్యలు తప్పవని అన్నారు. అన్ని గ్రామాల్లో డ్రంకన్ డ్రైవ్ పరీక్షలను చేపడతామని మద్యం సేవించి పట్టుబడితే కేసులు తప్పవని వేడుకలను పురస్కరించుకుని బైక్ కార్ రేసింగ్లు వంటి చేయరాదని అన్నారు. ఇతరుల స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా సంబరాలను జరుపుకోవాలని సూచించారు వేడుకల్లో భాగంగా ఎలాంటి అల్లర్లు అవాంఛనీయ సంఘటిత సంఘటన చోటు చోటు చేసుకోకుండా పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు నడుపుతామన్నారు. జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ సైతం అమల్లో ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రశాంత వాతావరణలో సంబరాలు జరుపుకొనేలా పోలీసులకు సహకరించాలని తెలిపారు
No comments:
Post a Comment