కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, ; అంగవైకల్యం ఉందని కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని జీఎం కే రవిశంకర్ అన్నారు. ప్రపంచ దివ్యంగా దినోత్సవాన్ని పురస్కరించుకొని బెల్లంపల్లి ఏరియా గోలేటి టౌన్ షిప్లోని సింగరేణి పాఠశాల మైదానంలో సోమవారం దివ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సేవా అధ్యక్షురాలు శ్రీమతి అనురాధ రవి శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు పలు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిఎం రవిశంకర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డిసెంబర్ మూడున దివ్యాంగుల దినోత్సవాన్ని సింగరేణి యాజమాన్యం నిర్వహిస్తుందని దివ్యాంగులు అంగవైకల్యం ఉందని కుంగిపోకుండా పట్టుదలతో కృషి చేసి ఆయా రంగాల్లో ఉన్నత స్థాయిల్లో వున్నారని అన్నారు ఈ సందర్భంగా దివ్యాంగులకు పలు ఆటల పోటీలు నిర్వహించారు. అందరికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న వారికి పాటలు పాడి డ్యాన్సులు చేసిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి డిజిఎం పర్సనల్ సుదర్శనం, డిజి డివైపిఎం ఎల్ రామశాస్త్రి డబ్ల్యూపీఎస్ స్పోర్ట్స్ సూపర్ వైజర్ రమేష్ , చంద్రకుమార్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment