కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, డిసెంబర్ 30: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలో రెబ్బన మండలంలోని అన్ని గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యమిచ్చి పార్టీ అభ్యర్థులను పెడతామని సీపీఐ మండల కార్యదర్శి రాయిల్లా నర్సయ్య అన్నారు..ముఖ్యంగా గోలేటిలో పార్టీ తరుపున ఈ సారి అభ్యర్థి బరిలో ఉంటాడని అన్నారు, ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే తాయిలాలు ప్రకటిస్తున్నాయని అన్నారు. ప్రజలు ఈ తాయిలాలు ఆశపడి అభ్యర్థులను ఎన్నుకోవద్దని, నిజంగా ప్రజలపక్షాన నిలబడి, ఊరికి మంచి చేసే అభ్యర్థులనే గెలిపించాలని అన్నారు. .రాబోయే ఎన్నికలలో సీపీఐ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే, గ్రామాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని అన్నారు.
No comments:
Post a Comment