కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, డిసెంబర్ 21 ; సింగరేణి డైరెక్టర్ ఫైనాన్స్ శ్రీ బలరామ్ నాయక్ బెల్లంపల్లి ఏరియా ను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బెల్లంపల్లి ఏరియా అన్నిరంగాలలో పురోగతిని ప్రదర్శిస్తున్నదని అన్నారు. సింగరేణి కుటుంబంలో ఒక సభ్యుడినైనందుకు తనకు చాలా సంతోషంగా ఉందని మనం అందరం కలిసి నూతన ప్రాజెక్టుకై కృషి చేసి సింగరేణి పూర్వ అభివృద్ధికి పాటుపడదామని అన్నారు. బెల్లంపల్లి ఏరియాను అన్నివిధాలా అభివృద్ధి చేయడంలో కృషి చేస్తున్న జీఎం శ్రీ కే రవిశంకర్ ను, ఉద్యోగులను, కార్మికులను అభినందించారు ఈ సందర్భంగా డైరెక్టర్ ను శాలువా పుష్పగుచ్ఛాలతో జిఎం రవిశంకర్ సన్మానించారు అనంతరం డోర్లి మరియు కైరిగూడ ప్రాజెక్టులను సందర్శించి నారు ఈ సందర్భంలో సింగరేణి కాలరీస్ ఎస్సీ ఎస్టీ మరియు సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ బోడ భద్రు, లైజన్ ఆఫీసర్ ఏ రాజేశ్వర్ ఆధ్వర్యంలో సంఘం సభ్యులందరూ డైరెక్టర్ సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎస్వోటు జిఎం శ్రీ కే సాయిబాబా, ఇంజనీర్ శ్రీ బసిరెడ్డి , ఎస్వోటూ డైరెక్టర్ ఫైనాన్స్ శ్రీ ప్రసాదరాజు ,డిజిఎం పర్సనల్ జె కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment