మాదిగల నిరసన పోరు పోస్టర్ ఆవిష్కరణ
రెబ్బెన : ఏప్రిల్ 12 (వుదయం ప్రతినిధి) రెబ్బన మండలంలోని మాదిగల నిరసన పోరు ఏప్రిల్ 5 నుండి ఏప్రిల్ 14 వరకు జరుగు నిరసన ప్రదర్శన - ధర్నాలు-రాస్తారోకోలు సంభందించిన పోస్టర్ను యం అర్ పి స్ మండల అద్యక్షుడు బొంగు నరసింగ రావు, మండల కార్యదర్శి నర్సింహులు, మండల అధికార ప్రతినిధి గోగార్ల రాజేష్, గ్రామా అధ్యక్షులు రొడ్డ శంకర్ వారి పోస్టర్ ను ఆవిష్కరించారు.
దళితున్ని ముఖ్యమంత్రి చేయాలి, మాదిగలకు, మాలలకు మంత్రి వర్గంలో ప్రాతినిద్యం కల్పించాలి, దళితుల సంక్షేమాన్ని చూసే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిని ఏర్పాటు చేయాలి
దళితులకు భూ పంపిణి చేయాలి, అంబేద్కార్,జగ్జీవన్ రామ్ ల జయంతి ఉత్సవాల కమిటి చైర్మన్ గా దళితున్ని నియమించాలి డిమాండ్ చేశారు. కార్యక్రమం లో యం అర్ పి స్ కార్యకర్తలు పి . వినెయ్, పి ఆయిలు, జి నగేష్, రమేష్ , గణేష, తుఖరం రాజిఖ సంఘ అద్యక్షుడు శంకర్, తే ధ పా నాయకులూ మోడం రాజ గౌడ్ నాగరాజు నాయాకులు మద్దత్తు తెలిపారు
No comments:
Post a Comment