ఉపాదీ హామీ చట్ట రక్షణకోసం జీపు యాత్ర
రెబ్బెన : ఏప్రిల్ 5 (వుదయం ప్రతినిధి): ఉపాధి హామీ పతకాన్ని పకడ్బందిగా అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన జీపు జాత ఆదివారం రెబ్బెన కు చేరుకుంది స్థానిక రెబ్బెన ఆర్&బి భవనం వద్ద వ్యవసాయ శాక జిల్లా కార్యదర్శి ఎస్. సత్యనారాయణ ఉపన్యాసం ఇచ్చారు ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుందన్నారు పని దినాలు 200 రోజులకు ప్రతి రోజు రూ. 300 ఇవ్వాలని, ఉపాధి మెట్లకు పారితోషికం రూ . 6 ఇవ్వాలి ఉపాధి సిబ్బందికి వేతనాలు పెంచాలి ఉద్యోగ భద్రత కల్పించాలి పోడు భూములకు పట్టలివ్వాలి ఈ భూముల అభివృద్ధి ఉపాధి నిధులు కేటాయించాలి ఉపాధిలో అవినీతి చర్యలు అరికట్టాలి ఉపాధి చట్టాన్ని బలహీనపరిచే కేంద్ర బి.జే.పి.ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించాలి ఉపాధి కొందరికే కాదు అందరికి ఇవ్వాలి. అని డిమాండ్ చేసారు ఈ యాత్ర ఏప్రిల్ 4 నుంచి 11 వరకు కొనసాగుతుంది ఈ నెల 11 న హైదరాబాద్ లో భారి ధర్నా కొనసాగుతుంది.అని వ్యవసాయ శాక జిల్లా కార్యదర్శి ఎస్. సత్యనారాయణ తెలిపారు.ఆయనతో పాటు ఆసిఫాబాద్ డివిసన్ కార్యదర్శి బి.ప్రకాష్,వినోద్,ప్రణయి,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment