Thursday, 28 February 2019

ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

 కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 28 ; రెబ్బెన మండలం నక్కల గూడ  ప్రాథమిక పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రెబ్బెన  ప్రభుత్వ పాఠశాల   ప్రధానోపాధ్యాయురాలు సిహెచ స్వర్ణ లత  హాజరయ్యారు.  ముందుగా సర్ సి వి రామన్ గారి  చిత్రపటానికి పూలమాలలు వేసి అలంకరించారు. అనంతరం   విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటినుండే ప్రకృతిని పరిశీలించడం తెలుసుకోవడం చేయాలని తద్వారానే జ్ఞానం పెరుగుతుందని తెలియజేశారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్వల శంకర్  మాట్లాడుతూ సర్ సి వి రామన్ గారి జీవితం ఎంతో మంది విద్యార్థులకు ప్రేరణ ఇస్తుందని తెలియజేశారు.  1928లో రామన్ ఎఫెక్ట్ అనబడే కాంతి కిరణాల గురించి పరిశోధనలో విజయం సాధించి  రామన్ ఎఫెక్ట్ కనిపెట్టినందుకు గాను ఆయనకు 1930లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నోబెల్ బహుమతి లభించిందన్నారు.    ఈ కార్యక్రమానికి  అతిధులుగా రెబ్బెన హైస్కూల్ జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు  శ్రీదేవి,   ఆంగ్ల ఉపాధ్యాయులు అనీస్ అహ్మద్   హాజరయ్యారు.  కార్యక్రమంలో పాఠశాల  ఉపాధ్యాయులు దేవరకొండ రమేష్  మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment