Sunday, 17 February 2019

ఆర్ధిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు

 కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 17 ;   రెబ్బెన మండలం పులికుంట  గ్రామంలో వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆర్ధిక అక్షరాస్యతపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిధి గా హాజరైన నాబార్డ్ అధికారి అంజన్న మాట్లాడుతూ  ప్రజలు  నగదు  రహిత లావాదేవీలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు.ఈ విధానం ద్వారా బహుళ ప్రయోజనాలున్నందున వాటిని వాడడం అలవాటు చేసుకోవాలని అన్నారు. సంపాదించిన ప్రతి పైసాను దుబారా చేయకుండా పొదుపు పాటిస్తే భవిష్యత్తులో ఉపయోగపడతాయన్నారు.   ఈ కార్యక్రమంలో పులికుంట గ్రామ సర్పంచ్ పోచమల్లు, వ్యవసాయ పరపతి సంఘం సి ఈ ఓ సంతోష్ ,  రైతులు , గ్రామస్తులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment