Friday, 8 February 2019

వన నర్సరీ ప్రారంభం

కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 8  ; హరితహారం పథకంలో నాటిన మొక్కలను జాగ్రత్తగా కాపాడాలని రెబ్బెన సర్పంచ్ అహల్యాదేవి అన్నారు. శుక్రవారం రెబ్బెనలో వన నర్సరీని ప్రారంభించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనాన్ని పెంపొందించేందుకు హరితహారం పథకాన్ని శ్రీకారం చుట్టి అమలు చేస్తుందన్నారు. . హరితహారంలో నాటిన నాటిన ప్రతి మొక్కను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. 3లక్షల 50వేలు వేయంతో ఏర్పాటు చేస్తున నర్సరీలో  50000  మొక్కలు  వచ్చే జూన్ నాటికి పంచాయతీ పరిధిలో నాటేందుకు అవసరం పడే మొక్కలు సిద్ధమవుతాయని తెలిపారు. పంచాయతీలో నాటగా మిగిలిన మొక్కలు ఇతర పంచాయతీలకు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో  ఉప సర్పంచి మడ్డీ శ్రీనివాస్ ,  టి ఏ  వై  జయ,  ఫీల్డ్ అసిస్టెంటు ఏ .తుకారం లు  పాల్గొన్నారు.  

No comments:

Post a Comment