Sunday, 17 February 2019

కెసిఆర్ జన్మదినం సందర్భంగా హరిత హారం

కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 17 ;  ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని రెబ్బెన సర్పంచ్ బొమ్మినేని  అహల్యాదేవి అన్నారు. ఆదివారం కెసిఆర్ జన్మదినం సందర్భంగా రెబ్బెన   గ్రామ పంచాయతీ ఆవరణలో  మొక్కలు  నాటారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి పర్యావరణ కాపాడటంలో భాగస్వాములు కావాలని  తెలంగాణ హరిత రాష్ట్రానికి అందరూ కృషి చేయాలన్నారు.  ప్రతి ఒక్కరి  పుట్టిన రోజు చెట్టు నాటాలని  ఈ సందర్భంగా సూచించారు..   ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మెన్ కుందారపు శంకరమ్మ,   ఉపసర్పంచు మడ్డి శ్రీనివాస్,  మాజీ ఉప సర్పంచ్ బొమ్మిన శ్రీధర్,   నాయకులు జాకీ ఉస్మాని సుదర్శన్ గౌడ్ శాంతి  కుమార్ గౌడ్,  శంకర్,  అశోక్, జహీర్ బాబా, వినోద్ జైస్వాల్, తిరుపతి, మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment