Sunday, 17 February 2019

గంగాపూర్ జాతర భద్రతా ఏర్పాట్ల పరిశీలన

రెబ్బెన ; గంగాపూర్ బాలాజీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో  ఆదివారం నుండి  మూడు రోజులు జరగబోయేకళ్యాణం, రధోత్సవం, జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని ఎస్పీ మల్లారెడ్డి సూచించారు. శనివారం  రెబ్బెన మండలం గంగాపూర్  బాలాజీ వెంకటేశ్వర స్వామివారి  దర్శనం చేసుకున్నారు.  ఈ  సందర్భంగా జిల్లా పోలీస్ సూపెరింటెండ్ కు ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి బాపి రెడ్డి, అర్చకులు గణేష్ పంతులు, , గ్రామ సర్పంచ్  లు  ఘనస్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. అనంతరం భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన ఆయన మాట్లాడుతూ కొమురంభీం ఆసిఫాబ్ జిల్లాలో ఎంతో   ప్రఖ్యాతి వహించిన  స్వామివారి కళ్యాణానికి, భారి సంఖ్యలో భక్తులు విచ్చేయు సందర్భంగా  వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇతర ప్రభుత్వ , స్వచ్చంద సంస్థలతో సమన్వయము చేసుకొని పోలీస్ శాఖ  భద్రత మరియు దర్శనం చేయించాలని సూచించారు. ఆయన వెంట ఆసిఫాబాద్ డి ఎస్ పి  సత్యనారాయణ, సర్కిల్ ఇన్సపెక్టర్  రమణ మూర్తి,, ఎస్సై దీకొండ  రమేష్, ఉన్నారు. ఈ కార్యక్రమంలో పందిర్ల మాదనయ్య,  రమేష్, వెంకటేష్, సర్వేశ్వర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment