కొమరంభీం ఆసిఫాబాద్ (రేబ్బెన) ఫిబ్రవరి 4 ; తెలంగాణ అమరవీరుడు తాళ్లపెల్లి వేణుకుమార్ గౌడ్ జయంతి సందర్భంగా సోమవారం రెబ్బన యూపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు తల్లిదండ్రులు ప్రభాకర్ గౌడ్, నాగలక్ష్మిలు భోజనం ప్లేట్లు మరియు స్వీట్లు పంపిణీ చేశారు రెబ్బెన గ్రామ సర్పంచ్ బొమ్మినేని అహల్యాదేవి, ఎంపిపి కర్నాధం సంజీవ్కుమార్, ఎస్సై దికొండ రమేష్ లు ముఖ్య అతడులుగా పాల్గొని విద్యార్థులకు అమరవీరుని అల్లిదండ్రులు సమకూర్చిన వస్తువులను అందచేశారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్దగా చదువుకొని జీవితంలో అభివృద్ధిలోకి రావాలని అన్నారు. తెలంగాణ అమరవీరుడు తాళ్లపెల్లి వేణుకుమార్ గౌడ్ ఆత్మశాంతికి 2 నిమిషాలపాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మద్ది శ్రీనివాస్ గౌడ్, మండల తెరాస పార్టీ అధ్యక్షులు పోటు శ్రీధర్ రెడ్డి, నాయకులు సుదర్శన్ గౌడ్ , పెసర మదునయ్య, బొమ్మినేని శ్రీధర్ కుమార్, జాకీర్ ఉస్మాని, కృష్ణ, అఫ్రోజ్, నాసిర్ ఉస్మాని , పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఖాదర్ , సీఆర్పీ దేవేందర్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment